నిమ్మగడ్డ గాడ్ ఫాదర్ నరసింహన్..! సీఎంగా చంద్రబాబు అడ్డుపడ్డా పదవి..!

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ది… తన సామాజికవర్గమే కాబట్టి.. చంద్రబాబు.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించుకున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయనను తాను నియమించలేదని చెప్పుకొచ్చారు. నిజానికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌ని అంత తేలిగ్గా నియమించడానికి .. తీసేయడానికి అవకాశం ఉంటే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అధికారయంత్రాన్ని ప్రక్షాళన చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పుడే మార్చి ఉండేవారు. కానీ.. ఎస్‌ఈసీది రాజ్యాంగపరంగా స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ. ఆయనను తొలగించడానికి అవకాశం లేదు. అందుకే మిన్నకుండిపోయారు. అలాగే నియామకం కూడా.. ప్రభుత్వం జరపదు గవర్నర్ నియమిస్తారు. 2015లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నియామకం జరపాల్సిన అవసరం ఏర్పడింది. నియమించాల్సింది గవర్నరే అయినా… ప్రభుత్వానికి చాయిస్ ఉంటుంది. ఆ మేరకు.. అప్పుడే రిటైర్ అయిన.. సీఆర్ బిశ్వాల్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గవర్నర్ నరసింహన్ కు పంపారు. కానీ.. నరసింహన్ అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం.. ఎస్‌ఈసీకి హైకోర్టు న్యాయమూర్తి స్థాయి హోదా ఉంటుందని.. దానికి .. ఐఏఎస్‌గా చీఫ్ సెక్రటరీ స్థాయికి చేరిన వారే అర్హులని ఫైల్ ను వెనక్కి పంపారు.

ఆ సమయంలో… ఏపీ సర్కార్ కు.. గవర్నర్ నరసింహన్ మధ్య సంబంధాలు గొప్పగా లేవు. చాలా అంశాల్లో గవర్నర్ తో ప్రభుత్వం విబేధిస్తోంది. అలాంటి సమయంలో.. బిశ్వాల్ నియామకంపై ఫైలును వెనక్కి పంపడమే కాదు.. అన్ని విధాలుగా అర్హుడని.. తన వద్ద ఏడేళ్లగా.. సెక్రటరీగా పని చేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరును.. గవర్నర్ ప్రతిపాదించారు. చంద్రబాబు పట్టుదలతో ఓ సారి ఫైల్ వెనక్కి పంపినప్పటికీ..గవర్నర్ వెనక్కి తగ్గలేదు. అప్పట్లో ఈ అంశంపై మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చంద్రబాబు చెప్పిన అధికారిని నరసింహన్ ఎస్‌ఈసీగా నియమించడానికి అంగీకరించలేదని… చంద్రబాబుకు ఎదురుదెబ్బ అని ప్రచారం కూడా చేశారు. చివరికి చంద్రబాబు గవర్నర్ ప్రతిపాదననకు అంగీకరించక తప్పలేదు. ఇదే విషయాన్ని ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు చెప్పారు. తన చాయిస్ బిశ్వాల్ అయితే.. రమేష్ కుమార్ ను గవర్నర్ రికమెండ్ చేశారని కుండబద్దలు కొట్టేశారు. అంటే చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందనప్పటికీ.. బిశ్వాల్ ను ఎస్‌ఈసీగా నియమించాలనుకున్నారు.. తన సామాజికవర్గానికి చెందినప్పటికీ.. నిమ్మగడ్డను తాన చాయిస్ కాదనుకున్నారు.

కానీ ముఖ్యమంత్రి మాత్రం.. దీనికి భిన్నంగా చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అఫీసరే. కానీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న పధ్నాలుగేళ్ల కాలంలో…ఆయనకు ఎప్పుడూ ప్రాధాన్యతా పోస్టులు దక్కలేదు. లూప్ లైన్‌లోనే ఉండిపోయారు. దానికి కారణాలు ఏమిటో తెలియదు కానీ.. వైఎస్ హయాంలో మాత్రం.. ఆర్థిక శాఖ లాంటి ముఖ్యమైన శాఖల్లో పదవులు పొందారు. ఆ తర్వాత గవర్నర్ వద్ద ఏడేళ్లు కార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వ సర్కిల్స్‌లో .. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. చంద్రబాబుకు కానీ.. టీడీపీకి కానీ ఫేవర్ ఉంటారన్న ప్రచారమే ఉండదు. అయినప్పటికీ.. ప్రస్తుతం స్థానిక ఎన్నికల వాయిదా విషయంలో.. చంద్రబాబు సామాజికవర్గానికి ముడిపెట్టి విమర్శలు మాత్రం.. వైసీపీ నేతలు గుప్పిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘జై హ‌నుమాన్‌’లో తేజా స‌జ్జా లేడా?

'హ‌నుమాన్తో' తేజా స‌జ్జా ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సీక్వెల్‌గా 'జై హ‌నుమాన్' రూపుదిద్దుకొంటోంది. ఇందులో తేజా స‌జ్జా ఉంటాడా, ఉండ‌డా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. నిజానికి ఈ సినిమాలో...

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close