ఏపికి ప్రత్యేక హోదా ప్రధాని మోడి పరిశీలనలో ఉందిట!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇక రాదనే చేదు నిజాన్ని రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ మానసికంగా జీర్ణించుకొంటున్న ఈ సమయంలో మళ్ళీ కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ మరియు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ప్రత్యేక హోదాపై ఆశలు రేకెత్తిస్తున్నట్లుగా మాట్లాడారు.

శుక్రవారం కడపలో పర్యటించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసే విషయంపై నీతి ఆయోగ్ తన నివేదికని ప్రధాని నరేంద్ర మోడికి సమర్పించింది. ప్రస్తుతం అది ప్రధాని మోడి పరిశీలనలో ఉంది. త్వరలోనే ఆయన దానిపై ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది,” అని చెప్పారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా దానిని దృవీకరిస్తూ “దీనిపై ప్రధాని త్వరలోనే సముచితమయిన నిర్ణయం తీసుకొంటారు,” అని మీడియాకి తెలిపారు.

ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వం వెనకడుగు వేసినందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక ప్రత్యేక హోదా రాదని మానసికంగా అంగీకరిస్తున్న సమయంలో మళ్ళీ కేంద్రమే ఈ అంశం గురించి ప్రస్తావించడం ద్వారా కొత్త సమస్యలను ఆహ్వానించుకొంటున్నట్లుంది. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి మంజూరు చేస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చి సుమారు ఏడెనిమిది నెలలు కావస్తోంది. కేంద్రప్రభుత్వం కనీసం ఆ హామీని కూడా ఇంతవరకు నేరవేర్చలేకపోయింది.

మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం మొదలుపెట్టడం వలన ప్రజలకు మానుతున్న గాయాన్ని మళ్ళీ కెలికి దానిపై కారం చల్లినట్లవుతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి ఇవ్వడం సాధ్యం కాదని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొందని కేంద్రప్రభుత్వం తేల్చి చెపితే రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు ఏవిధంగా స్పందిస్తాయో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే 20 నెలలు గడిచిపోయాయి. ఇంకా పరిశీలనలోనే ఉన్నాయని కేంద్రప్రభుత్వం చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close