పెళ్లి ఇంత కష్టమా? వద్దు బాబోయ్!: నితిన్

  • స్పీచ్ స్టార్టింగులో… ‘కథ విన్న వెంటనే పెళ్లి చేసుకోవాలని అనిపించింది’!
  • స్పీచ్ మధ్యలో… ‘పెళ్లి ఇంత కష్టమా? వద్దు బాబోయ్! అనుకున్నా’
  • ఆ వెంటనే… ‘సారీ మమ్మీ! టీవీ చూసి కంగారుపడకు. పక్కా పెళ్లి చేసుకుంటా’

ఆదివారం రాత్రి జరిగిన ‘శ్రీనివాస కళ్యాణం’ ఆడియోలో మాట్లాడిన నితిన్.. మూడు నిమిషాల్లో మూడు భిన్నమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. పెళ్లి గురించి, ఇంట్లో పెడుతున్న పోరు గురించి, సినిమా షూటింగులో ఎదురైన అనుభవాల గురించి టకాటకా చెప్పేశాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. ఆదివారం ఆడియో విడుదల చేశారు.

ఆడియో వేడుకలో నితిన్ మాట్లాడుతూ “కొన్ని సంవత్సరాలుగా మా అమ్మ పెళ్లి చేసుకోమని చంపేస్తుంది. నేనేమో వద్దంటున్నా. అటువంటి టైమ్‌లో సతీష్ వేగేశ్న వచ్చి ఈ సినిమా కథ చెప్పారు. కథ ఎంత నచ్చిందంటే… వెంటనే పెళ్లి చేసుకోవాలని అనిపించింది. పెళ్లంటే.. ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ల టైపులో కాదు. మా సినిమాలో చూపించబోయే పెళ్లి టైపులో. తర్వాత షూటింగ్ మొదలైంది. పెళ్లి సీన్స్, పెళ్లిలో భాగంగా చేసే వ్రతాలు, పూజలు, జనాలు, గోల చూసి… ‘అమ్మో… పెళ్లి అంటే ఇంత కష్టమా? వద్దు బాబోయ్’ అనిపించింది” అన్నాడు. వెంటనే ఏమనుకున్నాడో… ఏమో… “సారీ మమ్మీ. టీవీ చూసి కంగారుపడకు. పక్కా పెళ్లి చేసుకుంటా! ఊరికే ఈ మాటలు చెబుతున్నా” అన్నాడు. అదండీ సంగతి. ఈ సినిమా మీద నితిన్ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తన కెరీర్లో టాప్ 3 సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close