నేను చూసిన అనుభ‌వాలే ఈ సినిమా: దిల్‌రాజు

ప్ర‌తీ సినిమాతోనూ ఓ ప్ర‌త్యేక అనుబంధం ముడివేసుకోవ‌డం దిల్‌రాజుకి అల‌వాటు. కుటుంబ క‌థా చిత్రాల్లో ఈ సెంటిమెంట్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. `శ్రీ‌నివాస క‌ల్యాణం` సినిమా కూడా ఆయ‌న మ‌న‌సుకు చాలా ద‌గ్గ‌రైపోయింది. దిల్ రాజు సంస్థ నుంచి వ‌స్తున్న చిత్ర‌మిది. నితిన్‌, రాశీఖ‌న్నా జంట‌గా న‌టించారు. ఆగ‌స్టు 9న విడుద‌ల అవుతోంది. “నా కూతురి పెళ్లి, మ‌న‌వ‌డు పుట్టిన క్ష‌ణాలు, భార్య చ‌నిపోయిన‌ప్పుడు అనుభ‌వించిన బాధ‌.. ఇలా నా జీవితంలో నేను చూసిన అనుభ‌వాలే ఈ సినిమా. ఈ చిత్రంలోని పాత్ర‌లు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో నిలిచిపోతాయి. ఇంటికెళ్లిన త‌ర‌వాత కూడా గుర్తుండిపోయే స‌న్నివేశాలున్నాయి. ఆగ‌స్టు 9 త‌ర‌వాత ప్ర‌తీ ఇంట్లోనూ ఓ పెళ్లి జ‌రుగుతోంద‌న్న భావ‌న తీసుకొచ్చే సినిమా అవుతుంద‌“న్నారు దిల్‌రాజు. “త్రేతాయుగం, ద్వాప‌ర యుగం, క‌లియుగం… ఇలా యుగాలు మారినా, దేవుడు మ‌నిషి అవ‌తారం ఎత్తినా పెళ్లి గొప్ప‌ద‌నం గురించి చెబుతూనే ఉన్నాడు. మేం కూడా ఈ సినిమాలో అదే చెప్పాం. పెళ్లి విశిష్ట‌త‌ని చాటి చెప్పే చిత్రం అవుతుంద‌“న్నారు స‌తీష్ వేగ్నేశ‌. ఈసినిమాలో న‌టించిన న‌టీన‌టులంతా ఈ క‌థ‌ని, త‌మ పాత్ర‌నీ మ‌న‌సుల్లోకి ఎక్కించేసుకున్న‌ట్టున్నారు. అందుకే రాశీఖన్నా, ప్ర‌కాష్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్ వీళ్ల మాట‌ల్లో భావోద్వేగాలు ఎక్కువ‌గా క‌నిపించాయి. మ‌రి.. ప్రేక్ష‌కుల్నీ ఈ సినిమా అలానే క‌దిలిస్తే… దిల్‌రాజు బ్యాన‌ర్‌లో మ‌రో హిట్టు ప‌డిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close