సావిత్రి దొరికేసింది

మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ సినిమాగా రాబోతోంది. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో ఆక‌ట్టుకొన్న నాగ అశ్విన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. అశ్వ‌నీద‌త్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. సావిత్రి పాత్ర కోసం అర‌డ‌జ‌ను హీరోయిన్ల పేర్లు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. అనుష్క‌, విద్యాబాల‌న్, ప‌రిణితీ చోప్రా ఇలా చాలామంది పేర్లు అనుకొన్నారు. చివ‌రికి ఆ ఛాన్స్ నిత్య‌మీన‌న్‌కి ద‌క్కిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల నాగ్ అశ్విన్‌, అశ్వ‌నీద‌త్ ఇద్ద‌రూ నిత్య‌ని క‌ల‌సి క‌థ వినిపించార్ట‌. ఈచిత్రంలో న‌టించ‌డానికి నిత్య కూడా అంగీక‌రించింద‌ని స‌మాచారం. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో తెర‌కెక్కించే ఈ చిత్రాన్ని హిందీలోకీ తీసుకెళ్లాల‌న్న ఆలోచ‌న ఉంది. 2016 చివ‌ర్లో ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. 2017 వేస‌వికి విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. సావిత్రి జీవితంలో తెలియ‌ని కోణాల్ని సృశిస్తూ సాగే ఈ చిత్రంలో ఇంకొంత‌మంది స్టార్ హీరోలు అతిథి పాత్ర‌లు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. బ‌యోపిక్‌ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న ఈ కాలంలో… సావిత్రి జీవిత క‌థ‌ని ఎలా తెర‌కెక్కిస్తారో, ఆ చిత్రం ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close