ప‌వ‌న్ ఎంట్రీ.. ఈసారి నిత్య‌మీన‌న్ కూడా!

టాలీవుడ్ మ‌ళ్లీ షూటింగుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. సుదీర్ఘ విరామం త‌ర‌వాత‌.. స్టార్స్ అంతా సెట్స్ బాట ప‌ట్టారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అతి త్వ‌ర‌లోనే… మేక‌ప్ వేసుకోబోతున్నారు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం `వీర‌మ‌ల్లు`తో పాటు `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 12 నుంచి `అప్ప‌య్య‌యుమ్‌` కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. 12నే ప‌వ‌న్ కూడా సెట్స్ లోకి వ‌స్తున్నాడ‌ట‌. ప‌వ‌న్ కి తోడుగా ఈసారి నిత్య‌మీన‌న్ కూడా రాబోతోంది. ఈ రీమేక్ లో నిత్య‌మీన‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలిసారి తాను కూడా సెట్స్‌లోకి అడుగుపెట్ట‌బోతోంది. 12 నుంచి 18 వ‌ర‌కూ సాగే ఈ షెడ్యూల్ లో.. ప‌వ‌న్‌, నిత్య‌ల‌పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. ఈ సినిమా కోసం `ప‌ర‌శురామ కృష్ఱ‌మూర్తి` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ సినిమాకి ఇదే టైటిల్ అని.. ప్రచారం జ‌రుగుతోంది. అయితే.. చిత్ర‌బృందం టైటిల్ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లే స‌మ‌కూరుస్తున్న విష‌యం తెలిసిందే. టైటిల్ బాధ్య‌త కూడా ఆయ‌నపూనే ఉంది. త్రివిక్ర‌మ్ కి `అ` సెంటిమెంట్ ఉంది. ఆ అక్ష‌రంతో మొద‌ల‌య్యే టైటిల్ కోసం ఆయ‌న అన్వేష‌ణ మొద‌లెట్టార‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close