బీజేపీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం జనసేన చేస్తుందా..!?

పవన్ కల్యాణ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. బుధవారం నుంచి ఆయన మంగళగిరిలోనే ఉంటూ.. రాజకీయ కార్యకలాపాలాను ఉద్ధృతం చేయనున్నారు. అయితే.. ఇప్పుడు.. బీజేపీ విషయంలో ఆయన వ్యూహం ఎలా ఉందన్నది జనసేన నేతలకూ అంతుబట్టడం లేదు. కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలపై పవన్ కల్యాణ్‌కు అంత సదభిప్రాయం లేదు. దానికి కారణంగా ఏపీ బీజేపీ నేతల తీరే. జనసేనతో పొత్తు ఉందని.. అవసరానికిమాత్రమే వాడుకుని ఇతర సందర్భాల్లో ఒక్క బీజేపీని మాత్రమే ప్రమోట్ చేసుకుంటున్నారు. కనీసం ప్రజాపోరాటాలకు సిద్ధమైనప్పుడు కూడా జనసేనతో కలిసి పోరాటం చేయాలన్న ఆలోచన చేయడం లేదు. ఇటీవల ఉద్యోగ క్యాలెండర్‌పై బీజేపీ పోరాడింది. కానీ.. జనసేనకు సమాచారం లేదు.

ఏపీ బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా జనసేనను నిర్వీర్యం చేసేప్లాన్ అమలు చేస్తున్నారన్న అనుమానాలు పవన్ కల్యాణ్‌లో ఉన్నాయని అంటున్నారు. అందుకే వీలైనంతగా బీజేపీని ఎవాయిడ్ చేసి..సొంతంగా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి బీజేపీ- జనసేన ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుని సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని గతంలోనే నిర్ణయించారు. కానీ ఆ సమావేశాలు చివరి సారిగా ఎప్పుడు జరిగాయో రెండు పార్టీల నేతలకు అసలు అసలు గుర్తుందో లేదో తెలియదు. బీజేపీ తీరు వల్ల జనసేన క్యాడర్‌లోనూ అసంతృప్తి పెరిగిపోతోంది.

స్థానిక ఎన్నికల తర్వాత… తిరుపతి మున్సిపల్ ఉపఎన్నిక తర్వాత బీజేపీ – జనసేన మధ్య గ్యాప్ బాగా పెరిగింది. దీన్ని సరి చేసుకునే ప్రయత్నాన్ని ఏపీ బీజేపీ నాయకత్వం చేయలేదు. ప్రస్తుత బీజేపీ ఏపీ నాయకత్వంలో అధికార పార్టీ సానుభూతిపరులు ఎక్కువగా ఉన్నారు. వీరు ఎవరూ పవన్ కల్యాణ్‌ మీద సదభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపించరు. ఆయన క్రేజ్‌ను వాడుకుని ఏదో తమబలం అన్నట్లుగా చూపించుకుందామని ప్రయత్నిస్తారు కానీ .. నిజంగా ఆయనకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వరని అంటున్నారు. ఇప్పుడు అయినా పవన్ కల్యాణ్… అమరావతి వస్తున్నారు. ఆయనను కలిసి.. సంయుక్త పోరాటాలపై చర్చిస్తే.. కాస్త గౌరవం ఇచ్చనట్లు. లేకపోతే.. రెండు పార్టీల మధ్య గ్యాప్ మరింత పెరిగినట్లవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close