హీరోయిన్ ద‌ర్శ‌క‌త్వం

హీరోల‌కు ద‌ర్శ‌కులుగా మారాల‌ని ఉంటుంది. ఎందుకంటే.. చాలా వ‌ర‌కూ.. స‌హాయ ద‌ర్శ‌కులుగా ప‌నిచేసి వ‌చ్చిన‌వాళ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తారు. క‌థ‌ల విష‌యంలో వాళ్ల‌కు ప‌ట్టుఉంటుంది. అందుకే.. ఒక్క‌సారైనా మెగాఫోన్ ప‌ట్టాల‌ని అనుకుంటారు. క‌థానాయిక‌లు అలా కాదు. వ‌చ్చామా? డ‌బ్బులు సంపాదించుకున్నామా? వెళ్లిపోయామా? అనుకుంటారు. క‌నీసం.. ప్రొడ‌క్ష‌న్‌లో కూడా దిగ‌రు. అది ఇంకా రిస్క్ అని వాళ్ల‌కు తెలుసు. కానీ.. కొంత‌మంది క‌థానాయిక‌లు అలా కాదు. మ‌న‌సులో `ద‌ర్శ‌క‌త్వ‌` ఆలోచ‌న బ‌లంగా ముద్ర వేసుకుని ఉంటుంది. నిత్య‌మీన‌న్ కి మెగాఫోన్ ప‌ట్టాల‌ని క‌ల‌. అందుకు ప్లానింగ్ కూడా చేస్తోంది.

ఇప్పుడు అదే బాట‌లో నివేదా థామ‌స్ ప‌య‌నించ‌బోతోంది. నిన్నుకోరి, జెంటిల్‌మెన్ లాంటి సినిమాల‌తో ఆక‌ట్టుకుంది నివేదా. ఇప్పుడు.. `వి`లోనూ నటించింది. త్వ‌ర‌లోనే దర్శ‌క‌త్వం వ‌హించాల‌ని భావిస్తోంద‌ట‌. “ద‌ర్శ‌క‌త్వం అన్న‌ది నా క‌ల‌. ఎప్ప‌టికైనా మెగాఫోన్ ప‌డ‌తాను. అందులోని మెళ‌కువ‌ల‌పై దృష్టి పెడుతున్నా“ అంటోంది నివేదా. కాక‌పోతే మ‌రో రెండు మూడేళ్లు కేవ‌లం న‌టన‌పైనే దృష్టి పెట్టాల‌నుకుంటోంద‌ట‌. ఆ త‌ర‌వాతే కెప్టెన్ కుర్చీలో కూర్చుంటుంద‌ట‌. మ‌రి… నివేదా ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఎలా ఉంటుందో తెలియాలంటే అప్ప‌టి వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close