పవన్‌కు స్పష్టత వుంటే కదా చెప్పడానికి!

జనసేన అధినేత నటుడు పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ పర్యటనతో అపహాస్యం చేసేవారి సంఖ్య పెరిగింది. ఆ పైన అనంతపురంలో మంత్రి పరిటాల సునీత గృహ దర్శనం తర్వాత ఆయనను సీరియస్‌గా తీసుకోవడం తగ్గుతున్నది. చెప్పాలంటే ఇంతకంటే అన్నయ్య చిరంజీవి చాలా మెరుగ్గా వ్యవహరించారనే మాట అన్నిచోట్టా వినిపిస్తున్నది. ప్రజల గురించి ప్రస్తావిస్తూనే ప్రభుత్వాలను ప్రశంసలతో ముంచెత్తడం ప్రతిష్టను మసకబార్చిందనడంలో సందేహం లేదు. దీన్నిభర్తీ చేసుకోవడానికి ఆయన చాలా అవస్థలు పడాల్సి వుంటుంది. తెలుగుదేశంతో పొత్తు అవకాశాలను కూడా అట్టిపెట్టుకోవడంతో ఆయన స్వంత శక్తిగా వస్తారా అనే సందేహాలు పెరిగాయి. అయినా అప్పుడే పూర్తిగా కొట్టిపారేయొద్దని పార్టీలు భావిస్తున్నాయి. తమాషా ఏమంటే వైసీపీలో పవన్‌పై చాలా ఆసక్తి వుండటం. తనను ఏమాత్రం ఖాతరు చేయనవసరం లేదంటూనే ఏమన్నారు ప్రభావం ఎలా వుంది అంటూ వైసీపీ నేతలు పదేపదే ప్రశ్నలు వేసి తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పటికీ పవన్‌కు యువతలో చాలా ప్రభావం వుంటుందనే అంచనా కొనసాగుతున్నది. దాన్నిమరోసారి బిజెపి టిడిపిలకు తోడు చేసి కొంపముంచుతాడేమోనన్న ఆందోళన వైసీపీయేతర ప్రతిపక్షాలలో వుంది. ఎటొచ్చి ఆ ప్రశ్నకు సమాధానమివ్వగల స్పష్టత ఆయనకే లేనప్పుడు మనకేం చెబుతారని ఒక నాయకుడు సరదాగా ఆన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.