నో కాంట్రాక్ట్..! ధోనికి రిటైర్మెంట్ గుర్తు చేసిన బీసీసీఐ..!

మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ ముగిసిపోయిందని… బీసీసీఐ గట్టి సంకేతాలు పంపింది. ప్రతీ ఏటా.. ఆటగాళ్లకు ఇచ్చే కాంట్రాక్టుల్లో ఈ సారి ధోనీ పేరు మిస్ అయింది. ఆటగాళ్లకు నాలుగు కేటగిరీల్లో బీసీసీఐ కాంట్రాక్టులిస్తుంది. ఏ ప్లస్ , ఏ,బీ, సీ అనే కేటగిరీల్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు ఏడాది పాటు నిలకడైన వేతనం ఇస్తుంది. ఏ ప్లస్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా మాత్రమే చోటు దక్కించుకున్నారు. వీరికి ఏడాదికి ఏడు కోట్లు చెల్లిస్తారు. గత ఏడాది ధోనీకి ఏ కేటగరిలో చోటు కల్పించారు. ఈ ఏడాది పూర్తిగా మర్చిపోయారు. ప్రపంచకప్ సెమీఫైనల్లో..న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత ధోనీ మళ్లీ ఇంత వరకూ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు.

అయితే ఐపీఎల్ ఆడారు. మళ్లీ ఎప్పుడు మ్యాచ్ లు ఆడతారో.. క్లారిటీ లేదు. అలాగని రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదు. టెస్టులకు ఎప్పుడో గుడ్ బై చెప్పారు. త్వరలో వన్డేలనూ వదులుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీంతో.. కాంట్రాక్టుల జాబితా నుంచి ధోనీని తప్పించినట్లుగా తెలుస్తోంది. నిజానికి బీసీసీఐలో కొద్ది రోజులుగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సౌరవ్ గంగూలీ బీసీసీఐ చీఫ్ అయ్యారు. ఆ తర్వాత తనదైన ముద్ర వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పూర్తిగా ప్రొఫెషనలిజంతో… టీం ఎంపిక ఉండాలన్న అభిప్రాయంతో.. గంగూలీ ఉన్నారని అంటున్నారు.

ఈ క్రమంలో.. ఆయన ధోనీ ఎంపీక … పూర్తిగా ఇప్పుడు చూపిన ప్రతిభ ఆధారంగా ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో.. ధోనీ ఇక టీ ట్వంటీలకు పరిమితం కావడమో..లేదా… వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చే ఆలోచనను బీసీసీఐ కల్పించడమో చేస్తుందని అంటున్నారు. మొత్తానికి ధోనీ ఇప్పటికి చాలా సార్లు రిటైర్ అవబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ.. అది ఇప్పుడు ముంచుకొచ్చేసినట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close