బీజేపీ, జనసేన టార్గెట్ 2024

2024 ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా.. పొత్తులు పెట్టుకుంటున్నామని బీజేపీ , జనసేన ప్రకటించాయి. నాలుగున్నరేళ్ల పాటు కలిసి.. కష్టపడి ప్రజాపోరాటాలు చేసి.. అధికారం సాధిస్తామని.. ఉభయ పార్టీల ముఖ్య నేతలుధీమా వ్యక్తం చేశారు. నాలుగు రోజుల కిందట.. ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసి పొత్తులను ఖరారు చేసుకున్న పవన్ కల్యాణ్… ఈ రోజు విజయవాడలో.. రాష్ట్ర నేతలతో చర్చల తర్వాత అధికారికంగా ప్రకటించారు. అంతకు ముందు రెండు పార్టీల నేతల మధ్య.. వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. ఓ దశలో విలీన ప్రస్తావన కూడా వచ్చింది. కానీ విలీనం అయితే.. జనసేన కార్యకర్తలు ..బీజేపీతో కలుస్తారని నమ్మకం లేదన్న అభిప్రాయం ఇరు వర్గాల్లోనూ రావడంతో.. పొత్తులకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. సమావేశం తర్వాత.. ఇరు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. ఏపీ భవిష్యత్‌, రాష్ట్ర ప్రయోజనాల కోసం… బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు.

జనసేన-బీజేపీ భావజాలం ఒక్కటిగానే ఉందన్నారు. ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందని .. కేంద్రంలో బలమైన ప్రభుత్వం వల్ల ఏపీకి లాభమని పవన్ చెప్పుకొచ్చారు. గతంలో.. బీజేపీతో మనస్ఫర్థలు వచ్చాయని.. వాటిని సర్దుబాటు చేసుకున్నామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. 2024లో బీజేపీ-జనసేన అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. రెండుపార్టీల మధ్య సమన్వయం కోసం కోఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేసుకుంటామన్నారు. రాజధాని విషయంలోనూ.. సమావేశంలో చర్చ జరిగింది. రెండు పార్టీలు.. అమరావతి కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాయి. రాజధాని విషయంలో వైసీపీ ఏకపక్షంగా ముందుకెళ్తే చూస్తూ ఊరుకోమని బీజేపీ, జనసేన .. వైసీపీని హెచ్చరించాయి. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని అమరావతిని స్వాగతించారని.. అవసరమైతే క్షేత్రస్థాయిలో పోరాడతామని పవన్ ప్రకటించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం బీజేపీ-జనసేనతోనే సాధ్యమని కన్నా విశ్వాసం వ్యక్తం చేశారు. వైసీపీ నియంతృత్వ ధోరణిపై… గతంలో టీడీపీ చేసిన అవినీతిపై కలిసి పోరాడతామన్నారు.

జగన్‌ ఏకపక్షంగా ముందుకెళ్తారని అనుకోవడంలేదని చెప్పుకొచ్చారు. జనసేనతో కలిసి ఏపీలో అద్భుత రాజకీయ ఫలితాలు సాధిస్తామని జీవీఎల్… ఏపీలో కుల, వారసత్వ రాజకీయాలను అంతమొందిస్తామని సునీల్ ధియోధర్ ప్రకటించారు. ప్రత్యేకహోదా అంశాన్ని పవన్ కల్యాణ్.. బీజేపీ నేతలతో జరిగిన చర్చల్లో తీసుకు రాలేదు. మీడియా అడిగితే.. గతంలో చంద్రబాబు ప్యాకేజీ తీసుకోకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. అంతిమంగా.. 2014లో ఏర్పడిన బీజేపీ – జనసేన పొత్తు.. మళ్లీ 2020లో .. సాకారం అయింది. కమ్యూనిస్టు పార్టీలకు తాను బాకీ లేదని.. పనిలో పనిగా పవన్ క్లారిటీ ఇచ్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close