ప్లీనరీలోకి హరీష్‌కు నో ఎంట్రీ !

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సోమవారం జరగనుంది. ఈ ప్లీనరీకి హరీష్ రావుకు ఆహ్వానం లేదు. ఆయన ఒక్కరికి మాత్రమే కాదు హుజురాబాద్ ఎన్నికల పనులు చూసుకుంటున్న ఎవరికీ ఆహ్వానం లేదు. అందరూ ఎన్నికల పనుల్లోనే బిజీగా ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. హుజూరాబాద్‌లో ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్న వారెవరూ కూడా నియోజకవర్గంలో నుంచి కదలవద్దని చెప్పారు.అక్కడ మకాం వేసిన టీఆర్ఎస్ ముఖ్య నాయకుల నుండి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రచారినికే పరిమితం కానున్నారు.

గత ఐదు నెలలుగా నియోజకవర్గం ఆంతటా కలియ తిరుగుతున్న వారంతా పార్టీ ద్విశతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనలేకపోతున్నారు. ఈనెల 30నే పోలింగ్ జరగనున్నందున అందరు ఒక్క సారిగా ప్లీనరీకి తరలి వస్తే హుజురాబాద్‌లో ఒక రోజు పూర్తిగా టీఆర్ఎస్ యాక్టివిటీ ఆగిపోతుందని అది పార్టీకి నష్టం చేస్తుందని టీఆర్ఎస్ హైకమాండ్ భావించినట్లుగా తెలుస్తోంది. నిజానికి ప్లీనరీకి హాజరయ్యే వారిసంఖ్యను కూడా పరిమితం చేశారు. మొదట్లో పదిహేను వేల మంది వరకూ అంచనా వేశారు.

కానీ తర్వాత కేసీఆర్ కేవలం ఆరు వేల మందితోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఆహ్వానం ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు . దీంతో స్థాయిలను బట్టి ఆహ్వానాలు పంపుతున్నారు. వారు మాత్రమే హాజరవుతారు. ఏ స్థాయిలో ఉన్నా హుజురాబాద్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న వారు హాజరయ్యే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

ఆయన 20 మంది ఎమ్మెల్యేలతో వచ్చేత్తా అంటే కేసీఆరే వద్దన్నారట !

కాంగ్రెస్ ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే ఓ సీనియర్ నేత .. కేసీఆర్ తో టచ్...

కేంద్ర‌మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్… బీజేపీ అగ్రనేత జోస్యం!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కేంద్ర‌మంత్రి కాబోతున్నారా...? మ‌ల్కాజ్ గిరి దీవించి పంపితే జ‌రిగేది అదే అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర‌మంత్రి. మల్కాజ్ గిరిలో ఈట‌ల గెలిస్తే కేంద్ర‌మంత్రి అవుతారు అంటూ...

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close