సుభాషితాలు, చట్టాలు టీటీడీ బోర్డు పదవుల్లో పని చేయలే..!

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నిన్న లీక్ చేసిన పేర్లలో… ఎస్సీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేరును తొలగించి మిగిలిన అన్ని పేర్లను ప్రకటించింది. అంటే… 24 మంది టీటీడీ బోర్డు సభ్యుల్లో.. ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం ఏడుకి పడిపోయింది. ఏపీ నుంచి ఏడుగురు, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి టీటీడీలో చోటు దక్కింది. ఏపీ నుంచి నాదెండ్ల సుబ్బారావు, ప్రశాంతి, యూవీ రమణమూర్తి, మల్లికార్జునరెడ్డి, డీపీ అనంత, చిప్పగిరి ప్రసాద్‌కుమార్‌, పార్థసారథికి సభ్యులుగా చోటిచ్చారు. వీరిలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు.

ఏపీ నుంచి ఏడుగురు మాత్రమే.. !

తెలంగాణ నుంచి రామేశ్వరరావు, బి.పార్థసారథిరెడ్డి, వెంకటభాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి.దామోదరరావు, కె.శివకుమార్, పుట్టా ప్రతాప్‌రెడ్డికి అవకాశం కల్పించారు. ఈ జాబితా అంతా.. టీఆర్ఎస్ నుంచి అందినట్లుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక రమేష్‌శెట్టి, రవినారాయణ, సుధా నారాయణమూర్తికి సభ్యులుగా అవకాశం కల్పించారు. వీరిలో సుధా నారాయణ మూర్తి గత టీటీడీ బోర్డులోనూ సభ్యురాలిగా ఉండేవారు. ఈమె ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి. ఇక తమిళనాడు నుంచి వైద్యనాథన్‌, శ్రీనివాసన్‌, డా.నిశ్చిత, కుమారగురుకు అవకాశం కల్పించారు. ఇందులో శ్రీనివాసన్.. ఇండియన్ సిమెంట్స్ చైర్మన్. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితుడిగా ఉన్నారు. ఢిల్లీ నుంచి శివశంకరన్‌, మహరాష్ట్ర నుంచి రాజేష్‌ శర్మకు చోటు కల్పించారు. టీటీడీ బోర్డులో… చైర్మన్ తో కలిసి 25 మంది ఉండగా.. అందులో ఎనిమిది మంది మాత్రమే ఆంధ్రులు మిగతా వారంతా… అంటే 17 మంది ఇతర రాష్ట్రాల వారు.

ఆలయబోర్డుల్లో 50 శాతం బడుగులకే చట్టం అమలు చేయలేదేమి..?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేశారు. కానీ… నామినేటెడ్ పోస్టుల్లో మాత్రం… ఆంధ్రుల కన్నా.. ఇతర రాష్ట్రాల వారికే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. సలహాదారులు మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాల జర్నలిస్టుల్ని, ఉద్యోగుల్ని కూడా తెచ్చుకుంటున్నారు. నిజానికి అలాగే నామినేటెడ్ పోస్టుల్లో.. 50శాతం ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీలకు ఇస్తామని చట్టం చేశారు. టీటీడీ బోర్డు విషయంలో ఆ చట్టాలేమీ అమలు చేయలేదు. టీటీడీ ప్రత్యేకం కాబట్టి.. దేవాదాయ శాఖ పరిధిలోని కాదు కాబట్టి…వర్తించదని.. విమర్శలు వస్తే చెప్పుకుంటారమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇతర రాష్ట్రాల చేతుల్లోకి టీటీడీ బోర్డు..!

కేసీఆర్ స్వయంగా చేసిన సిఫార్సుల మేరకే.. ఏకంగా తెలంగాణ నుంచి ఏడుగుర్ని సభ్యులుగా నియమించినట్లుగా భావిస్తున్నారు. గత ప్రభుత్వం చాలా పరిమితంగా టీటీడీ బోర్డులో ఇతర రాష్ట్రాల సభ్యులను నియమించేది. అప్పుడు… తెలంగాణ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించేవారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాలకు కూడా.. ఒక్కొక్క సభ్యుడికే అవకాశం కల్పించేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం.. తెలంగాణ నుంచి… ఏపీతో పోటీగా .. ఏడుగురు చోటు దక్కించుకున్నారు. అంటే టీటీడీ బోర్డులో ఇతర రాష్ట్రాల వారి ఆధిపత్యమే..రూలింగ్ చేసే స్థాయిలో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close