ఒకే పార్టీలో ఉన్న త్రిమూర్తులు శత్రువేననన్న డిప్యూటీ సీఎం..!

తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. ఆయనను శత్రువుగానే చూస్తానని డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. దళితుల శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు ఉన్నారు. ఆ కేసు భయంతోనే ఆయన వైసీపీలో చేరారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. పిల్లి సుభాష్ చంద్రబోస్‌ … రామచంద్రపురం పర్యటనకు వచ్చిన సమయంలో… దళితులు అడ్డుకున్నారు. పార్టీలో చేర్చుకుని… తోట త్రిమూర్తులును కేసు నుంచి కాపాడి దళితులకు అన్యాయం చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. దీనిపై పిల్లి సుభాష్ చంద్రబోస్ నేరుగానే… తోట త్రిమూర్తులుపై విరుచుకుపడ్డారు. తోట త్రిమూర్తులు ఎప్పటికైనా తనకు శత్రువేనని ప్రకటించారు. పార్టీలోకి ఎందరో వస్తుంటారు…పోతుంటారని.. పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో.. వైసీపీ ప్రభుత్వం దళితుల పక్షాన ఉంటుందన్నారు.

వైసీపీకి దళితులు అండగా ఉన్నారు.. వారిని వదులుకోబోమని హామీ ఇచ్చారు. తోట త్రిమూర్తులపై ఉన్న కేసులో ఏదైనా తేడా జరిగితే బాధితులను సీఎం దగ్గరికి తీసుకెళ్తానని.. అవసరమైతే దళితులతో కలిసి ధర్నా చేసేందుకైనా సిద్దమేనని ప్రకటించారు. నిజానికి తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రాపురం నియోజకవర్గంలో… ఆగర్భ శత్రువులు. వారి మధ్య వైరం రాజకీయంగా మాత్రమే కాదు.. వ్యక్తిగతంగా కూడా ఉంటుంది.చాలా సమావేశాల్లో వీరు తిట్టుకునే తిట్లు.. చాలా పై స్థాయిలో ఉంటాయి. రాయలేని భాషలో తిట్టుకుంటూ ఉంటారు.

2014 ఎన్నికల్లో ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను… రామచంద్రాపురం నుంచి తప్పించిన జగన్… వేణుగోపాల్ అనే నేతకు టిక్కెట్ ఇచ్చారు. పిల్లి సుభాష్‌కు… ఆశల్లేని మండపేట సీటు ఇచ్చారు. అక్కడ ఆయన పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ… మొదటి నుంచి తనతోనే ఉన్నందున.. జగన్ పిల్లి సుభాష్‌కు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు త్రిమూర్తులను పార్టీలోకి తీసుకోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close