అప్పుడు రాజ్యసభ.. ఇప్పుడు శాసనమండలి..! లైవ్ సిగ్నల్ కట్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ తలుపులు మూసేసి.. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి.. విభజన చట్టాన్ని ఆమోదించామని.. అప్పటి ప్రభుత్వం ప్రకటించుకుంది. నిజానికి అక్కడ ఏం జరిగిందో.. రికార్డులు కూడా లేవు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి లీడర్ టర్న్‌డ్ లాయర్లు మాత్రం… పంతం పట్టుకుని మరీ.. విభజన రాజ్యాంగ విరుద్ధమని.. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి వాయిదాలకు తిరుగుతూంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మూడు రాజధానుల నిర్ణయానికి శాసనమండలిలో ఆమోదించుకోవడానికి ప్రభుత్వం.. ఈ మార్గాన్నే ఎంచుకుంది. శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసింది.

లోపల ఏం జరుగుతుందో.. బయటకు తెలియనివ్వకుండా.. అధికారపక్షం వ్యవహరిస్తోంది. రూల్ నెంబర్ 71 ప్రకారం.. అసలు విభజన చట్టాన్ని చర్చ చేపట్టకుండానే తిరస్కరించడానికి టీడీపీ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ కారణంగానే.. లోపల గందరగోళం ఏర్పిడంది. ఏకంగా… మండలి సభ్యులు కానీ పదిహేను మంది మంత్రులు.. మండలిలో తిష్ట వేశారు. వారందరూ.. మండలి చైర్మన్ పై ఒత్తిడి తెస్తున్నారు. బిల్లు మూజువాణి ఓటుతో పాస్ అయ్యేలా సహకరించాలని ఒత్తిడి చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

అలాగే.. టీడీపీ ఎమ్మెల్సీలకు ప్రలోభాలు కూడా.. చూపిస్తున్నారని.. ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాగైనా.. బిల్లును ఆమోదించుకున్నాం..అనిపించుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. దీని ఫలితం ఎలా ఉంటుందో కానీ.. విభజన సమయంలో రాజ్యసభలో జరిగిన..ఘట్టం.. ఇప్పుడు.. ఏపీ శాసనమండలిలో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. విభజన సమయంలో.. కాంగ్రెస్ వ్యవహరించినట్లే.. ఇప్పుడు.. వైసీపీ వ్యవహరిస్తోందని.. మండి పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close