బీజేపీ అంటే ఫైరని ప్రజలనుకోవాలి .. నేతలు కాదు !

ఏపీ బీజేపీ నేతల తాపత్రయాన్ని ప్రజలు కనీసం పట్టించుకోవడం లేదు. శ్రీశైలంలో మత చిచ్చు పెట్టి రాష్ట్రం మొత్తం అంటించి ఏదో సాధిద్దామని అనుకున్నారు. బీజేపీ అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అని డైలాగులు చెప్పి.. రచ్చ చేద్దామనుకున్నారు. కానీ ఏం చేసినా తుస్సుమంటోంది. ప్రజలు వారి పోరాటాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. కర్నూలులో సభ పెట్టిన బీజేపీ ముఖ్య నేతలు.. వైసీపీపై ఘాటు విమర్శలే చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

సోము వీర్రాజు చాలా ఘాటుగా సీఎం జగన్మోహన్ రెడ్డి దేశ ద్రోహి అని కూడా విమర్శించారు. కానీ ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ప్రజాసమస్యల మీద కంటితుడుపు ప్రకటనలు చేసి.. అన్ని విధాలుగా వైసీపీకి అండగా ఉంటున్నారని ఏపీ బీజేపీ నేతలపై ప్రజలకు గట్టి అనుమానం ఉంది. దీన్ని తుడిపేసుకోవాలంటే ప్రకటనలతో సాధ్యం కాదు. అంతకు మించి ఏదో ఓ చర్య తీసుకోవాల్సి ఉంటుంది.కానీ బీజేపీ విషయంలో అలాంటివేమీ ఉండటం లేదు. ఓ వైపు ఘాటు ప్రకటనలు చేసినప్పుడు వైసీపీ నేతలు బీజేపీ లీడర్లను దారుణంగా తిట్టి పోస్తున్నారు.

వారికి కౌంటర్ఇవ్వడానికి కూడా బీజేపీ నేతలకు చేతులు రావడం లేదు. ఎంత చెప్పినా..బీజేపీలో ప్రస్తుతం పెత్తనం చెలాయిస్తున్న వర్గం వైసీపీకి మేలు చేయడానికే పని చేస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది కానీ తగ్గడం లేదు. దీన్ని తగ్గించుకుని ఫైర్ చూపిస్తే తప్ప.. ప్రజలు బీజేపీ అంటే పుష్పం అనే అనుకుంటే.. ఫైర్ అని అనుకోరు. నాయకత్వం మార్చితేనే ఆ ఫైర్ కనిపించే అవకాశం ఉంది. లేకపోతే లేదనేది .. చాలా కాలం నుంచి బీజేపీలోనే ఉన్న వారి మాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close