తెదేపాలో చేరిన ఎమ్మెల్యేలు మళ్ళీ వైకాపాలోకి వెళ్లిపోతారా?

వచ్చే ఎన్నికలలోగా రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ సీట్లు పెరుగుతాయనే ముఖ్యమంత్రుల హామీలు, 2026 వరకు అమలు చేయడం కాదని ఇవ్వాళ్ళ కేంద్రం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 20మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలోకి, తెలంగాణాలో కాంగ్రెస్, తెదేపాలకి చెందిన 16మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. కేంద్రం చేసిన ఆ ప్రకటనతో వారందరి భవిష్యత్ అగమ్యగోచరంగా మారినట్లయింది. వారిదే కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి కూడా ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. సిటింగ్ ఎమ్మెల్యేలు, పార్టీలో కొత్తగా వచ్చి చేరినవారిలో ఎవరికి టికెట్స్ దక్కుతాయో తెలియదు కనుక అందరూ ఆందోళనపడక తప్పదు.

ఈ పరిస్థితిలో తెదేపా, తెరాసలలో కొనసాగడం కంటే మళ్ళీ తమ స్వంత గూటికి ఇప్పుడే తిరిగి చేరుకొంటే కనీసం అక్కడైనా తమ సీట్లు తమకే దక్కుతాయని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భావించినట్లయితే, త్వరలోనే అందరూ స్వంత గూళ్ళకి బయలుదేరే అవకాశం ఉంది. తెలంగాణాలో తెదేపా దెబ్బతిని ఉంది కనుక ఆ పార్టీ నుంచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు అటువంటి ఆలోచన చేయకపోవచ్చు. కానీ నేటికీ తెలంగాణా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది కనుక తెరాస లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశం ఉందని భావించవచ్చు.

అదేవిధంగా ఏపిలో వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చి చేరినవారందరూ మళ్ళీ స్వంత గూటికి బయలుదేరినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, తెదేపాలో ఎప్పుడూ టికెట్స్ కోసం చాలా తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది. శాసనసభ సీట్లు పెరిగే అవకాశం లేదని స్పష్టం అయ్యింది కనుక వైకాపా నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలు సిటింగ్ ఎమ్మెల్యేలతో టికెట్స్ కోసం పోటీ పడలేరు. పడినా ప్రయోజనం ఉండకపోవచ్చు. కనుక ఇవ్వాళ్ళ కాకపోతే రేపయినా అందరూ స్వంత గూటికి బయలుదేరక తప్పదు. ఇది తెదేపాకి చాలా ఆందోళన కలిగిస్తే వైకాపాకి చాలా సంతోషం కలిగించే విషయమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close