డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాల్లేవు : తెలంగాణ ఎక్సైజ్ శాఖ

తెలుగు సినీ పరిశ్రమ సెలబ్రిటీలు అందర్నీ ఎక్సైజ్ శాఖ ఒడ్డున పడేసింది. ఎవరిపైనా బలమైన ఆధారాలు లేవని కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. డ్రగ్స్‌ కేసులో కెల్విన్ ఇచ్చిన స్టేట్‌మెంట్లలో అనేక మంది సెలబ్రిటీల పేర్లు ఉన్నప్పటికీ తప్పుదోవ పట్టించడానికే అలా చెప్పారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ కోర్టుకు చెప్పింది. సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించినట్లు ఆధారాలు కూడా లేవన్నారు. నిందితుడు కెల్విన్ చెప్పిన విషయాలను ఆధారాలుగా భావించలేమని ఛార్జిషీటులో పోలీసులు స్పష్టం చేశారు. దీంతో టాలీవుడ్ మొత్తం ఊపిరి పీల్చుకుంది. రెండు రోజుల కిందటే పూరి, తరుణ్ ల వద్ద సేకరించిన శాంపిల్స్‌లో ఆనవాళ్లు కూడా లేవని కోర్టుకు నివేదిక సమర్పించారు.

కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ప్రస్తుతం ఈడీ కేసును దర్యాప్తు చేస్తోంది. కెల్విన్‌తో ఆర్థిక వ్యవహారాలను నడిపిన సినీ ప్రముఖులను పిలిచి ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో కెల్విన్ అప్రూవర్‌గా మారారన్న ప్రచారం కూడాజరిగింది. కెల్విన్‌ను.. సినీ ప్రముఖులను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ అసలు సినీ ప్రముఖులతో ‌డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధం లేదని తేల్చి చెప్పడంతో వారికి ఊరట లభించనుంది.

అదే సమయంలో తెలంగాణలోనూ డ్రగ్స్ కేసు వ్యవహారం రాజకీయ అంశమయింది. రేవంత్ రెడ్డి , కేటీఆర్ మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్సైజ్ శాఖ గతంలో జరిగిన విచారణపై రేవంత్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వివరాలను ఎక్సైజ్ శాఖ ఇవ్వడం లేదని చాలా మంది సినీ ప్రముఖుల పేర్లను తప్పించారని రేవంత్ ఆరోపిస్తున్నారు. అయితే అసలు ఎలాంటి సెలబ్రిటీలపైనా బలమైన ఆధారాల్లేవని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేయడం ఇప్పుడు కీలకం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close