టిక్కెట్లు ప్రభుత్వమే అమ్మినా పర్వాలేదు.. రేట్లు పెంచండి !

తామే టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా అమ్మాలని కోరామని పేర్ని నానితో సమావేశం అయిన తరవాత టాలీవుడ్ నిర్మాతలు ప్రకటించారు. ఆదిశేషగిరిరావు, సి.కల్యాణ్ వంటి నిర్మాతలు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో పేర్ని నానిసమావేశం అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆన్ లైన్ వినోదం అందించేందుకు పారదర్శకత కోసం తాము ఆన్ లైన్ టిక్కెట్ పోర్టల్ ను తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. సమావేశంలో ఆన్ లైన్‌లో టిక్కెట్లు ప్రభుత్వమే అమ్మినా రేట్లు మాత్రం పెంచాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పేర్ని నాని కూడా రేట్లు పెంచుతామన్నట్లుగా మాట్లాడారు.

సినిమాలంటే ఇష్టపడే వారిని దోచుకుంటున్నారన్న భావన రాకుండా.. ప్రజలెవరూ ప్రశ్నించకుండా టిక్కెట్ ధరలను నిర్ణయిస్తామన్నారు. ప్రభుత్వ నిర్దేశించిన ధరలతో మాత్రమే టిక్కెట్లను అమ్మాలని ఆయన స్పష్టం చేశారు. ధియేటర్ల ఖర్చులను ప్రధానంగా పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లి రేట్లు పెంచాలని అడిగినట్లుగా ఆది శేషగిరిరావు చెప్పారు. పెరిగిపోయిన ఖర్చులకు అనుగుణంగా టిక్కెట్ రేట్లు ఉండాలని కోరినట్లుగా తెలిపారు. కొత్తగా విడుదలయ్యే సినిమాల బెనిఫిట్‌ షో కోసం అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం తప్పకుండా అనుమతి ఇస్తుందని ఆయన చెప్పారు.

అయితే ప్రెస్‌మీట్‌లో మాత్రం పేర్ని నాని బెనిఫిట్‌ షోల గురించి ఒక్కరు కూడా అడగలేదని స్పష్టం చేశారు. టాలీవుడ్‌కు మరో ఆప్షన్ లేకపోవడంతో టిక్కెటింగ్ పోర్టల్‌కు అంగీకరించినట్లయింది. ఇక రిలీజ్ కాబోయే పెద్ద సినిమాలన్నీ ప్రభుత్వం ద్వారానే టిక్కెట్ల అమ్మకాలు జరపడానికి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వమే టిక్కెట్లు అమ్మే పనయితే.. రేట్లు పెంచే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close