తూచ్.. శ్రీవారి భూములు అమ్మాలని బోర్డు నిర్ణయం తీసుకోలేదన్న సుబ్బారెడ్డి..!

శ్రీవారి భూములు అమ్మడానికి ఆస్తులు గుర్తించి..రిజిస్ట్రేషన్ అధికారాలను కూడా అధికారులకు కట్టబెట్టేసిన తర్వాత… ఇప్పుడు వివాదం ఏర్పడటంతో.. టీటీడీ బోర్డు చైర్మన్ మాట మార్చారు. భూములు అమ్మడానికి పాలక మండలి నిర్ణయం తీసుకోలేదని…కేవలం భూములు అమ్మకానికి రోడ్ మ్యాప్ మాత్రమే తయారు చేయాలని పాలక మండలి సూచించిందనే కొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చారు. వేలంపై రెండు బృందాలను ఏర్పాటు చేశాం.. వేలం వేయాలంటే ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలో చెప్పాలని కోరామన్నారు. నివేదికలు వచ్చిన తర్వాత నిర్ణయం ఉంటుందని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ధార్మిక వాదులు.. స్వాములు సహా అందరి అభిప్రాయాలు తీసుకుంటామని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. శ్రీవారికి భక్తులు సెంటిమెంట్‌తో ఇచ్చిన ఆస్తులను అమ్మడంపై దేశవ్యాప్త దుమారం రేగింది.

దీంతో ఎవరేమనుకున్నా ఆస్తుల్ని అమ్మి తీరుతామన్న విధానంతో నిన్నటి వరకూ ఉన్న టీటీడీ ఇప్పుడు.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు కానీ..మార్గాన్ని మాత్రం మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. టీటీడీలో నిరుపయోగంగా ఉన్న భూములను అమ్మడం కొత్తకాదని సుబ్బారెడ్డి.. అమ్మకం తప్పు కాదనే వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. 1974 నుంచి 2014 వరకు వందకుపైగా ఆస్తులు అమ్మారని.. లెక్కలు చెప్పారు. గ్రామాల్లో ఒకట్రెండు సెంట్ల టీటీడీ భూముల్ని కాపాడటం కష్టమని ఇప్పటికీ వాదిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం..శ్రీవారి భూముల్ని కూడా… దోచుకునేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు అన్ని వైపుల నుంచి వెల్లువెత్తాయి.

మాకు దోచుకోవాలన్న ఆలోచన లేదని.. అలా ఉంటే.. టీటీడీ భూములనే అమ్మాల్సిన అవసరం లేదని అంతకు మించిన మార్గాలున్నాయని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. షరా మామూలుగా చంద్రబాబు హయాంలో భూములు అప్పనంగా ఇచ్చేశారని ఆరోపణలు కూడా చేశారు. భూముల అమ్మకం విషయంలో అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. చివరికి స్వరూపానంద స్వామి కూడా భక్తుల సెంటిమెంట్లను గౌరవించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి చెప్పినట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇమేజ్ డ్యామేజ్ కావడంతో.. ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గతున్నట్లుగా కనిపిస్తోంది కానీ..శ్రీవారి భూముల్ని అమ్మబోమన్న ప్రకటన మాత్రం చేయలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close