బీజేపీ తల్చుకుంటే శ్రీవారి ఆస్తుల అమ్మకం నిలిపివేత ఎంత సేపు..!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయంపై బీజేపీ భగ్గమని లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు దీక్షలకు సిద్ధమయ్యారు..తెలంగాణ నేతలు కూడా.. ఊరుకునేది లేదని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా… బీజేపీ సిఫారసు మీద.. పాలకమండలిలో సభ్యుడిగా పదవి పొందిన రాకేష్ శర్మ కూడా.. ఈ అమ్మకాల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బోర్డు అనుమతితోనే… ఆస్తుల అమ్మకాల నిర్ణయం తీసుకున్నామని .. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చెబుతున్నారు కానీ.. రాకేష్ శర్మ మాత్రం.. అలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పడం లేదు. గత పాలక మండలి సమావేశం నిర్ణయం అని చెబుతూ.. ఇప్పుడు అమ్మకం ఏమిటని ప్రశ్నించారు. భక్తులు ఎంతో.. సెంటిమెంట్‌గా శ్రీవారికి ఆస్తులు విరాళాలుగా ఇస్తారని .. ఆ సెంటిమెంట్ ను గౌరవించి.. ఆస్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ.. టీటీడీ నిర్ణయంపై.. రాజకీయ పోరాటం చేస్తోంది. శ్రీవారి భక్తులు, హిందూ సంస్థలు, బీజేపీ శ్రేణులు ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపునిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా.. అదే వాదన వినిపిస్తున్నారు. శ్రీవారి ఆస్తులు రక్షించకపోతే.. ఊరుకునేది లేదని చెబుతున్నారు. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ కూడా భూముల విక్రయ నిర్ణయాన్ని వ్యతిరేకించారు భూములను అమ్మకుండా ఇతర మార్గాలను ఎందుకు అన్వేషించడం లేదు .. భూములు ఎందుకు అమ్ముతున్నారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. భూముల విక్రయంపై హైకోర్టు అనుమతి తీసుకున్నారా అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దేవుడి భూముల విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. నిలిపివేయడం.. చాలా చిన్న విషయమని.. అంటున్నారు.

అయితే.. శ్రీవారి విషయంలో రాజకీయ వివాదాలు రేపి.. లబ్ది పొందాలనుకుంటే మాత్రం.. బీజేపీ హైకమాండ్ మాత్రం సైలెంట్ గా ఉంటుందని… ఆ సైలెన్స్‌ను అర్థాంగీకారంగా తీసుకుని వైసీపీ సర్కార్ మందుకెళ్తుందని.. దాన్ని బీజేపీ హిందూత్వ రాజకీయంతో క్యాష్ చేసుకుంటుందని అంటున్నారు. నిజంగా శ్రీవారి ఆస్తులను.. పరిరక్షించాలని.. భక్తుల సెంటిమెంట్లను గౌరవించాలనే లక్ష్యం ఉంటే మాత్రం.. పై స్థాయిలో ఒత్తిడి తెచ్చి అయినా బీజేపీ.. వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని నిలిపి వేస్తుందని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close