ఆఫీసర్ “మమత” అంటే మజాకానా ?

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల్లోని ముఖ్య నేతలు టీఆర్ఎస్‌లో చేరి పదవులు అందుకున్న తర్వాత ఉద్యోగ సంఘాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చింది. అలాంటి వారిలో టీజీవో అధ్యక్షురాలిగా ఉన్న మమత ముఖ్యులు. మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్.. ఉద్యమ సమయంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్‌ను పెట్టారు. ఆయన మంత్రి అయ్యాక తన బాధ్యతల్ని మమతకు ఇచ్చారు. ఆయన కూడా అంతకు ముందు మున్సిపల్ కమిషనర్‌గా ఉండేవారు. ఇప్పుడు మమత కూడా మున్సిపల్ కమిషనరే. సుదీర్ఘంగా కూకట్ పల్లిలోనే పని చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఎల్బీనగర్‌కు బదిలీ చేశారు. కానీ సాయంత్రానికి ఉత్తర్వులు మారిపోయాయి. ఆమెను కూకట్ పల్లిలోనే కొనసాగించాలని ఉత్తర్వులు మార్చేశారు.

అవినీతి ఆరోపణలు విపరీతంగా ఉండటం.. సుదీర్ఘకాలంగా పని చేస్తూండటంతో గ్రేటర్ కమిషనర్.. ఐదుగురు జోనల్ కమిషనర్లను ఒక్క సారిగా బదిలీ చేశారు. ఇందులో మమత కూడా ఉన్నారు. వెంటనే ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రభుత్వ పెద్దలపైనే ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా మమత బదిలీ అగిపోయింది. మిగిలిన వారివి యధావిధిగా బదిలీలు జరిగిపోయాయి. వారికి అంత పలుకుబడి లేదు. నిజానికి మమతకు పదోన్నతి ఇవ్వడంపైనా వివాదం ఉంది. ఆమె కంటే 22 మంది సీనియర్లు ఉన్నప్పటికీ జోనల్‌ కమిషనర్‌గా ప్రమోషన్‌ ఇచ్చారు.

ఉద్యోగ సంఘాల నేతగా ఉండి..పలుకుబడితో మంచి పోస్టింగ్ పొంతున్న మమతపై ఇతర అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే ఏండ్ల నుంచి చాలా మంది అధికారులు ఎలాంటి విధులు లేకుండా ఖాళీగా ఉన్నారు. వారెవరికీ పోస్టింగ్ దక్కడం లేదు. ప్రధాన కార్యాలయంలో చాలా మంది పనిలేని విధుల్లో ఉన్నా.. వారికి మాత్రం మొండిచేయి చూపిస్తున్నారు. మమత వంటి వారు అధికారం చెలాయిస్తున్నారు. ఉద్యోగ సంఘం నేతల తమ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఉద్యోగుల కోసం కాదన్న అసంతృప్తి తెలంగాణ ఉద్యోగుల్లో పెరిగిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close