స్టైరిన్ లీకవ్వగానే వాళ్లు పారిపోయారట..!

ఎల్జీ పాలిమర్స్‌ సంస్థలో గ్యాస్ లీకేజీ జరిగింది. ఆ ఘటన కారణంగా అప్పటికప్పుడు పన్నెండు మంది… ఆ తర్వాత మరో ఇద్దరు చనిపోయారు. కానీ.. ఎల్జీ పాలిమర్స్‌లో పని చేసే వారికి చిన్న హాని కూడా జరగలేదు. ఘటన జరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇదే ప్రశ్న హైలెట్ అవుతోంది. లాక్ డౌన్ తర్వాత ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించడానికే…ఎల్జీ పాలిమర్స్‌ను రీ ఓపెన్ చేశారు.. అంటే పెద్ద ఎత్తున కార్మికులు వచ్చి ఉంటారని అంచనా వేశారు. కానీ ఎవరికీ అస్వస్థత కలగడం వంటివి జరగలేదు. అసలు ఆ సమయంలో ఎంత మంది కార్మికులున్నారన్నదానిపైనా క్లారిటీ లేదు. కానీ ఎన్జీటీ నియమించిన విచారణ కమిటీలో దీనిపై కాస్త క్లారిటీ వచ్చింది.

ప్రమాదకరమైన స్టైరిన్ ను… సేఫ్‌గా ఉంచడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన కంపెనీ యజమాన్యం.. ప్రమాదం జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో.. సిబ్బందికి తెలియచెప్పలేదు. గ్యాస్ లీక్ అవుతుందని తెలియగానే.. అక్కడి సిబ్బంది… క్రైసిస్‌ మేనేజ్‌మెంట్ పాటించలేదు. ఆ గ్యాస్‌ను కట్టడి చేయడానికి చిన్న ప్రయత్నం చేయలేదు. లీక్ అవుతున్నట్లుగా తెలియగానే అక్కడి నుంచి సిబ్బంది మొత్తం పరారైపోయారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ చుట్టుపక్కల గ్రామాల వారందర్నీ బలి చేయడానికి ఏ మాత్రం వెనుకాడ లేదు. ఎన్జీటీ నియమించిన నిపుణుల కమిటీలో.. సిబ్బంది చేసిన ఘన కార్యం వెలుగులోకి వచ్చింది.

ఎల్జీ పాలిమర్స్.. ఓ ప్రమాదకర రసాయనంతో… ఉత్పత్తులు చేస్తున్నప్పుడు దానికి తగ్గట్లుగా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తల్లో కనీసం ఒక్క శాతం కూడా తీసులేదని.. ఎన్టీటీ నిపుణుల కమిటీ రిపోర్ట్ చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. అసలు పాలిస్టైరిన్ ఉత్పత్తులకు అనుమతే లేనప్పుడు… ఆ ముడిపదార్థాన్ని ఎలా విశాఖకు తీసుకు రాగలిగారన్నది మరో కీలకమైన అంశం. ఏపీ సర్కార్ మాత్రం.. తాము ఎలాంటి ఎన్వోసీ ఇవ్వలేదని… ఎన్జీటీకి స్పష్టం చేసింది.అయితే దరఖాస్తు చేసుకున్నారని… చెబుతోంది. అనుమతి ఇవ్వకుండా.. వారెలా ఉత్పాదక కార్యకలాపాలు ప్రారంభించారన్నది మరో కీలకమైన అంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close