జగన్ కొత్త కాన్సెప్ట్ : రైతులకు వన్‌స్టాప్ సర్వీస్ సెంటర్ ..!

రైతులకు వన్ స్టాప్ సర్వీస్ సెంటర్‌ను జగన్ ఏర్పాటు చేస్తున్నారు. అదే రైతు భరోసా కేంద్రం. రైతులకు కావాల్సిన అన్ని అవసరాలు ఆ కేంద్రంలో తీరేలా .. ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా… మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో వినూత్న సంస్కరణకు తెరతీయాలని జగన్ నిర్ణయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చేయడం ద్వారా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందన్న నమ్మకంతో కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు.

రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయశాఖ సూచనలు, సలహాలతో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. రైతుభరోసా కేంద్రంలో నాలెడ్జ్ సెంటర్, ఇంటర్ ఫేస్, ఇంటర్ వెన్షన్ సిస్టమ్ తో పాటుగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ, అనుబంధ రంగాలశాఖల అధికారుల సూచనలు, సలహాలను రైతులు నేరుగా పొందొచ్చు. నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు, రసాయన ఎరువులు అందించే సంస్థగానే కాకుండా రైతు విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పనిచేయనున్నాయి. రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో రైతులకు పూర్తి అండగా నిలుస్తాయని ప్రభుత్వం నమ్మకంతో ఉంది.

రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకుడు, సెరికల్చర్, ఫిషరీస్ అసిస్టెంట్స్ అందుబాటులో ఉంటారు. రైతు భరోసా కేంద్రాలకు మార్కెటింగ్ వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. ఆర్‌బీకేలో ఉండే అధికారులు ప్రతిరోజు పంటకు గిట్టుబాటు ధరలను పరీక్షించడం, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడం వంటి అంశాలను సమీక్షించి సంబంధించిత డేటాను పై అధికారికి పంపడం ద్వారా మార్కెటింగ్‌ శాఖ మానిటరింగ్‌ చేస్తుంది. అత్యాధునిక డిజిటల్‌ కియోస్క్‌ లు, టీవీలు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఏర్పాటుతో రైతులకు విజ్ఞాన, శిక్షణ కేంద్రాలుగా ఆర్ బీకేలు పనిచేయనున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close