తక్కువ ధరకే నాణ్యమైన మద్యం – చంద్రబాబు హామీ

ఏపీలో ఎక్కువ కుటుంబాలు సఫర్ అవుతున్న మ్యాటర్ జగన్ రెడ్డి బ్రాండ్లు. ఓ వైపు ఇల్లు గుల్లు. మరో వైపు నాసిరకం మద్యం. మద్యం దుకాణాల దగ్గరకు వెళ్లి మందుబాబుల్ని కదిలిస్తే జగన్ రెడ్డిపై స్తోత్రాలు వినిపిస్తూంటారు మందుబాబులు. ఆ అసంతృప్తిని చంద్రబాబు పక్కాగా పట్టుకున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ కనిగిరిలో ఏర్పాటు చేసిన రా కదిలిరా బహిరంగసభలో కొత్తగా మద్యం హామీ ఇచ్చారు.

జగన్ రెడ్డి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను పీల్చి పిప్పి చేస్తున్నారని..టీడీపీ రాగానే ఆ మద్యం మొత్తం తీసేసి అసలైన బ్రాండ్లను తక్కువ ధరకే అందిస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు హామీ కాస్త అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ.. అత్యంత కీలకమైన హామీగా భావించవచ్చు. మద్యం అనేది ఏపీలో చాలా కోర్ అంశం. ఏ ఇద్దరు కలిసినా దానిపైనే మాట్లడుకుంటారు. వ్యూహాత్మకంగా చంద్రబాబు ఈ హామీని ఇచ్చారనుకోవచ్చు.

చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ఓ రేంజ్ లో ప్రారంభించారు. ఈ నెల రోజుల పాటు ఆయన ప్రజల్లోనే ఉండనున్నారు. ఇప్పటికే వంద స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని పని చేసుకోమని సూచించారు. జనసేనకు ఇచ్చే సీట్లపైనా ఓ స్పష్టతకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఓ వైపు నిజం గెలవాలి పేరుతో నారా భవనేశ్వరి కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. నారా లోకేష్ మరో తరహా ప్రచార కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఏపీ వ్యాప్తంగా ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేయాలనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close