ధర్డ్ వేవ్‌కి కూడా ఆక్సిజన్ రెడీ..!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుతోంది. కరోనా తగ్గుతున్నా లేకపోయినా.. ఆక్సిజన్ మరణాలు మాత్రం ఎక్కడా నమోదు కావడం లేదు. నాలుగైదు రోజుల కిందటి వరకూ… ఆ ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోయిందంటే.. ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోయిందని … పరుగులు పెట్టేవారు. యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పించేవారు. ఇప్పుడు డిమాండ్ సగానికిపైగా తగ్గింది. సప్లయ్.. డబుల్ అయింది. 10 రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో బెడ్లు, ఆక్సిజన్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. కానీ వారం రోజుల నుంచి ఆ డిమాండ్ కనిపించడంలేదు. హోటళ్లు, ఇతర ఏసీ హాల్స్ ను తీసుకుని క్వారంటైన్ సెంటర్లు, తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేసినవారు ప్రస్తుతం వాటిని మూసివేస్తున్నారు.

క్వారంటైన్ సెంటర్లు కూడా మూసివేయటం ప్రారంభించారు. జూన్ 10వ తేదీ నాటికి తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుదంని అంచనా వేస్తున్నారు. కర్ఫ్యూ, లాక్ డౌన్ నిబంధనలు మరో వారం, పది రోజులు పొడిగిస్తారని అంచనా వేస్తున్నారు. పూర్తిగా కట్టడి చేసే వరకూ ఆంక్షలుండాలని … ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆక్సిజన్ విషయంలో ప్రభుత్వాలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నాయి. పెద్ద ఎత్తున విదేశాల నుంచి క్రయోజనిక్ ట్యాంకర్లు.. ఇతరులను పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించి కొనుగోలు చేశారు. ఏపీ ప్రభుత్వం తరపున బడా బడా కాంట్రాక్టులు పొందిన సంస్థలు కొంత ఆక్సిజన్ సంబంధిత పరికాలు తెప్పించడంలో సాయం చేశాయి.

చిరంజీవి లాంటి వారు ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. సోనూసూద్ లాంటి వారు నేరుగా ప్లాంట్లనే ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోఆక్సిజన్ సప్లయ్ మెరుగుపడింది. అదేసమయంలో డిమాండ్ తగ్గింది. మూడో వేవ్ ఉంటుందన్న నిపుణుల హెచ్చరికల నేపధ్యంలో ఇప్పటి ఆక్సిజన్ మౌలిక సదుపాయాలు… ముందు ముందు ఎంతో ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close