పి. రాములు తెదేపాకి గుడ్ బై…అయితే ఏమిటి?

ఇవ్వాళ్ళ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో తెలంగాణా రాష్ట్రాలో కరువుతో అల్లాడుతున్న రైతుల వ్యధకు అద్దం పడుతూ “మేము ఆత్మహత్య చేసుకొననవసరం లేదు ఎందుకంటే ఎలాగూ కరువుతో చచ్చిపోబోతున్నాము కనుక!” అని శీర్షికన ఒక కధనం ప్రచురించింది. అది చూస్తే చాలా బాధ కలుగుతుంది కానీ ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. తెలంగాణాలో తెదేపా పరిస్థితి కూడా అక్షరాల అలాగే ఉందిపుడు. దానిని ఇంకా ఎవరూ ఏమీ చేయనవసరం లేదు. దానంతట అదే క్రమంగా మాయమయిపోవచ్చు. కనుక ఇప్పుడు పార్టీలో ఎవరు ఉన్నా, వెళ్ళిపోయినా దానికి పెద్ద తేడా ఉండదు.

ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి పి. రాములు నిన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరిపోయినప్పుడు “తెలంగాణాలో తెదేపాకు మరో ఎదురుదెబ్బ” అనే హెడ్డింగ్ తో మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చేయి. అవి చూసినప్పుడు ప్రజలు నవ్వుకోకుండా ఉండలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీకి కొత్తగా తగిలే ఎదురు దెబ్బలు ఏమీ చేయలేవు. అది ఇప్పటికే కోలుకోలేని స్థితికి చేరుకొంది. దాని అధినేత చంద్రబాబు నాయుడు దాని గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. కనుక ఇంక ఎవరున్నా వెళ్ళిపోయినా ఆ పార్టీకి కొత్తగా వచ్చే లాభంకానీ నష్టం గానీ ఏమీ ఉండబోవు.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తెదేపాకి తెలంగాణాలో ఇటువంటి దయనీయమయిన పరిస్థితి ఏర్పడటం దాని అభిమానులకు బాధ కలిగిస్తుండవచ్చు కానీ ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయత ఉంది. కనుక ఏవిధంగా చేస్తే గౌరవప్రదంగా పార్టీని మూసివేసుకోవచ్చో, పార్టీలో మిగిలి ఉన్న నేతలు ఏవిధంగా తమ రాజకీయ భవిష్యత్ ని కాపాడుకోవాలో ఇప్పుడే ఆలోచించుకొంటే మంచిదేమో? లేకుంటే ముందు ఇంకా అవమానకర పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు.

ఈవిధంగా ఆలోచించడం చాలా దుర్మార్గంగా కనిపించవచ్చు లేదా రాజకీయ దురుదేశ్యంతోనే సూచిస్తున్నట్లు కనబడవచ్చు కానీ వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాస్తవిక దృక్పధంతో ఆలోచిస్తే ఇదే సరయినదని అంగీకరిస్తారు. లోక్ సత్తా పార్టీనే ఉదాహరణగా తీసుకొంటే అదికూడా ఇటువంటి వాస్తవిక దృక్పధంతోనే ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగడం గమనించవచ్చు. కనుక తెలంగాణాలో తెదేపా కూడా తన భవిష్యత్ గురించి వాస్తవిక దృక్పధంతో ఆలోచించవలసిన సమయం ఇదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close