తొక్కిసలాట వెనుక మరో కోణం – మీడియాను సిద్ధం చేసే యత్నం?

పోలీసు వాహనంతో సహా రాజమండ్రిలో దగ్ధమైన ఆరు వాహనాల మిస్టరీని ఆధారం చేసుకుని, గోదావరి పుష్కరాల మొదటిరోజు తొక్కిసలాటలో 27 మంది మరణాలనీ అనుమానాస్పద లేదా విద్రోహ చర్యగా చూపించే కోణం ఒకటి మీడియా ముందుకి వస్తోంది .

“పదకొండు రోజులు అపూర్వంగా సహకరించారు. ఇంకొక్కరోజు వుంది. కాస్త అప్రమత్తంగా వుండాలి. అనుమానానాస్పద పరిస్ధితులు వుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను” అని రాష్ట్రప్రభుత్వ కమ్యూనికేషన్ల సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ విలేకరులతో అన్నారు. ”ఏదైనా జరగవచ్చన్న ఎలర్ట్ వుందా” అన్న ప్రశ్నకు ”అదేమీలేదు ముందు జాగ్రత్తకోసమే తెలిసిన సమాచారాన్ని వెల్లడించడం వల్ల దర్యాప్తుకి అవరోధం కలగవచ్చు”అన్నారు.

విద్యుత్ షార్టు సరూ్క్యటు, సిలెండరు పేలుడు, విద్రోహచర్య మొదలుగా అన్నికోణాలనుంచీ అంబేద్కర్ విగ్రహంవద్ద అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ సందర్భంగా తెలుగుదేశాన్ని బలపరచే రెండు చానళ్ళలో ఒక చానల్ ఎకూ్ల్సజివ్ అంటూ ప్రమాద స్ధలం వద్ద ఒకవాహనాన్ని కొందరు తోసుకుని లాగుకుని కదలిస్తున్న క్లిప్పింగును చూపించింది. ప్రమాదకారణాలు ఏమీలేని ఈ క్లిప్పింగ్ ప్రయోజనమేమిటి అనే అనుమానం వస్తుంది. సిసి కెమేరా చిత్రీకరించిన ఈ వీడియోను సెంట్రల్ కంటో్రలు రూమ్ మాత్రమే ఇవ్వగలదు. పెద్దస్ధాయి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఇది ”లీక్” అయ్యే అవకాశమే లేదు.
ముఖ్యమంత్రి తీర్ధవిధులు నిర్వహిస్తున్న సమయంలో గంటల తరబడి క్యూలను ఆపివేసి చంద్రబాబు వెళ్ళిపోగానే గేటు తెరవడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు సైతం వివరించారు. అగ్గిప్రమాదం తరువాత మొదలైన ”అన్ని”కోణాల దర్యాప్తూ మొదటి రోజు దుర్ఘటనకు కూడా ఆపాదిస్తున్నారు. దీని ఫలితంగానే “ఆరోజు విద్యుత్ తీగలు తెగిపడ్డాయని ఎవరో వదంతి సృషించడం వల్లే తొక్కిసలాట జరిగిందనన్” వాదన రెండురోజులుగా ప్రచారం లోకి వచ్చింది. వివరణ అడిగితే అన్నికోణాలూ దర్యాప్తు చేస్తున్నాం అనిమాత్రమే పోలీసు అధికారులు చెబుతున్నారు.

అన్నికోణాలూ చూడటం పోలీసుల బాధ్యతే… ”ఫలానా కోణం నుంచి కూడా చూడాలి” అని పోలీసుబాసుల్ని నడిపించే రాజకీయ నాయకత్వం సూచిస్తే దర్యాప్తు ముగింపి ఎలా వుంటుందో ఎవరైనా ఊహించవచ్చు.

ప్రతి పదం ఎంతో అర్ధవంతంగా వుండేలా ఆచితూచి మాట్లాడే పరకాల ప్రభాకర్ మీడియా సమావేశంలో ”ఇంకొక్కరోజే ఎందుకైనా మంచిది జాగ్రత్తగా వుందాం” అనడంలో దర్యాప్తు లో కొత్త కోణాలను నిగూఢంగా సూచిస్తోంది.”పుష్కరాల ఏర్పాట్లు అద్భుతం, అమోఘం, అపూర్వం, సంపూర్ణంగా సంతృప్తికరం అని 95 శాతంకంటే హెచ్చు మంది యాత్రికులు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను విశ్లేషించిన పరకాలకు చివరిరోజు అప్రమత్తంగా వుండాలి అనే హెచ్చరిక ప్రజలను భయాందోళనలకు లోను చేయదని బాగాతెలుసు.

మనం అనుకోని ఏదో కోణం కూడా తొక్కిసలాటలో వుందని మీడియాకు ముందస్తు సూచన ఇవ్వడమే రాష్ట్రప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు ప్రయోజనం అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close