వైసీపీలోకి పర్చూరు, రేపల్లె ఎమ్మెల్యేలు..!?

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఇరువురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైపోయింది. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా సీఎంను కలిసే అవకాశం ఉంది. అధికారంగా పార్టీలో చేరరు. వైసీపీ అధినేత రాజీనామా చేయించిన తర్వాతే చేర్చుకోవాలనే ఓ నియమం పెట్టుకున్నారు. గతంలోనూ వీరిపై పార్టీ మార్పు కథనాలు వచ్చినా… ఇప్పుడు చర్చలు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆ పార్టీకి షాక్ ఇవ్వాలని కొద్ది రోజుల నుంచి వైసీపీ అగ్రనేతలు ప్లాన్‌లో ఉన్నారు. చివరికి చర్చలు జరిపి… ఓకే చేశారు.

ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాల గిరిధర్, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ లు వైసీపీకి మద్ధతు పలికారు. ఇప్పుడు మరో ఇద్దరు పార్టీని వీడుతూండటంతో.. గెలిచిన ఇరవై మూడు మందిలో ఐదుగురు గుడ్ బై చెప్పినట్లు అవుతుంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో నేరుగా విజయసాయిరెడ్డి చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో ఈ చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. తమపై తీవ్ర ఒత్తిడి ఉందని.. బుజ్జగించాలని ప్రయత్నించిన టీడీపీ నేతలకు వారు తేల్చి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. పర్చూరు ఎమ్మెల్యేకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. ఆయన కంపెనీల ఉత్పత్తుల్ని ఏపీలో అమ్మడం ఆపేశారు. దీంతో ఆయన ఆర్థిక చిక్కుల్లో పడ్డారు.

ఎన్నికల సమయంలోనే రేపల్లె ఎమ్మెల్యేకు హైదరాబాద్ ఆస్తుల విషయంలో బెదిరింపులు వచ్చాయని ప్రచారం జరిగింది. నిజమేనని.. ఆస్తులు పోయినా.. తాను టీడీపీ తరపున బరిలో ఉంటానని అప్పట్లో సత్యప్రసాద్ ప్రకటించారు. తనకు బాగా అప్పులయ్యాయని ఆ ఎమ్మెల్యే తన అనుచరుల వద్ద పార్టీ మార్పు కారణాలను చెబుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ వీడి వెళ్లేవారిని బతిమిలాడొద్దని అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close