పార్లమెంట్‌సమావేశాలు ప్రారంభం: బీజేపీపై పార్టీనేత లెటర్ బాంబు

హైదరాబాద్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవలికాలంలో చనిపోయిన పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎంపీలకు నివాళులు, ఇస్రో శాస్త్రవేత్తలకు, పేస్, సానియాలకు అభినందనలు ప్రకటించిన తర్వాత లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. కడియం శ్రీహరి రాజీనామాను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. అటు రాజ్యసభలోమాత్రం లలిత్ మోడి వ్యవహారంపై గందరగోళం చెలరేగింది. రాజస్థాన ముఖ్యమంత్రి వసుంధర రాజేపై విపక్షాలు విమర్శలు గుప్పించారు. లలిత్ మోడి అంశంపై చర్చకు కాంగ్రెస్ సభ్యులు పట్టుపట్టారు. ఐపీఎల్ వ్యవహారంపై చర్చకు సిద్ధమని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ప్రకటించారు. సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.

రెడ్ కార్నర్ నోటీసు జారీ అయిన లలిత్ మోడివంటి వ్యక్తికి విదేశాంగ వ్యవహారాలశాఖమంత్రి సుష్మా స్వరాజ్ సహాయపడటం, మరో కేంద్రమంత్రి స్మృతి ఇరాని విద్యార్హతల వ్యవహారం, వసుంధర రాజే వ్యవహారం, మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంలో జరిగిన వ్యాపం కుంభకోణం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయటానికి ప్రతిపక్షాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.  అయితే మంత్రులెవరూ రాజీచేయాల్సిన అవసరంలేదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖమంత్రి వెంకయ్య నాయుడు నిన్న అఖిలపక్షసమావేశం ముగిసిన తర్వాత చెప్పారు.

మరోవైపు కేంద్రమంత్రులు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకవైపు వివిధ వివావాదాలలో ఇరుక్కోవటంలో ఇబ్బంది పడుతున్న అధికారపక్షంపై సొంతపార్టీకే చెందిన ఒక ఎంపీ ఒక లెటర్ బాంబు పేల్చారు. బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణలు రావటం పార్టీ ప్రతిష్ఠకు మచ్చలు పడుతున్నాయని, అవినీతిని నిర్మూలించేందుకు పార్టీలో ఒక ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర మాజీ మంత్రి శాంతకుమార్ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఒక లేఖ రాశారు. ఈ లేఖ రాసి పదిరోజులైనప్పటికీ, ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకాబోతున్న తరుణంలో నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలలో బయటపడిన అవినీతికిగానూ సంబంధిత నాయకులపై పేర్లు ప్రస్తావించకుండా ఘాటుగా విమర్శలు చేశారు. శాంతకుమార్ హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close