మంత్రిని చేశారని మెత్తబడలేదన్న పట్నం !

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డి .. మంత్రి పదవిని అంగీకరించినంత మాత్రాన తాను మెత్తబడినట్లు కాదని స్పష్టం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నానని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా ఉంటానని ఆయన అంటున్నరు. గత ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మహేందర్ రెడ్డి.. స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే తర్వాత రోహిత్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు. దీతో మహేందర్ రెడ్డి పార్టీ మారిపోతారన్న ప్రచారం ఊపందుకుంది. కానీ అనూహ్యంగా ఆయనకు కేసీఆర్ కేబినట్ లో చోటు కల్పించారు.

మహేందర్ రెడ్డి పార్టీ మారకుండా.. బుజ్జగించేందుకు కేసీఆర్ మంత్రి పదవి ఆఫర్ చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మహేందర్ రెడ్డి మాస్ లీడర్. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనేది ఆయన అనుచరులు ఊహించ లేరు. మహేందర్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. మహేందర్ రెడ్డి మొదట టీడీపీలో ఉండేవారు. రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమ రాజకీయాలతో బీఆర్ఎస్‌లో చేరారు. ఆయన సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేసి రేవంత్ రెడ్డిపై గెలిచారు. అయితే మహేందర్ రెడ్డి ఓడిపోవడంతో మంత్రి పదవి కూడా రాలేదు. ఆయన వస్తానంటే.. బీజేపీ, కాంగ్రెస్ మంచి ప్రాధాన్యత ఇచ్చి చేర్చుకుంటాయనడంతో సందేహం లేదు.

మహేందర్ రెడ్డి మంత్రి ఎన్నికల సమయంలో.. ఖచ్చితంగా ఏదో ఓ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన మాటల్ని బట్టి స్పష్టమవుతోంది. మెత్తబడినట్లు కాదని ఎన్నికల్లో పోటీ చేయడంపై నిర్ణయం తీసుకుంటానని చెబుతూండటంతో.. ఆయన ఎన్నికల నాటికి ఏ పార్టీలో ఉంటారోనన్న ప్రారంభమయింది. చివరి దశలో మంత్రి పదవి ఇచ్చి కేసీఆర్ రిస్క్ తీసుకుంటున్నారేమోనన్న అభిప్రాయం బీఆర్ఎస్‌లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close