త్వరలోనే వస్తా.. టీడీపీ ఆఫీసు నుంచే పట్టాభి వీడియో !

ఆజ్ఞాతంలోకి వెళ్లానని తనపై ప్రచారం జరుగుతూడటంతో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ వీడియో విడుదలచేశారు. వైసీపీ నేతలు తమ ఇంటిపై దాడి చేసిన సమయంలో ఇంట్లో ఉన్న తన ఎనిమిదేళ్ల కూతురు భయాందోళనలకు గురైంది. మానసికంగా ఒత్తిడి గురైంది.. కుటంబ సభ్యుల ప్రశాంతత కోసమే తాను బయటకు వెళ్లానన్నారు. ఓ తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నానని ..త్వరలో వచ్చి మళ్లీ పార్టీలో అధికార ప్రతినిధిగా క్రీయాశీలక పాత్ర నిర్వహిస్తాననని ప్రకటించారు.

డ్రగ్స్ వల్ల ఓ తరం నిర్వీర్యం అయిపోకుండా తెలుగుదేసం పార్టీ ఉద్యమం ప్రారంభించిందని అందులో తన వంతు పోరాటం చేస్తున్నానన్నారు. తనపై నమోదైన కేసుల్లో న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు లేని అర్థాలను సృష్టించారని ఆరోపించారు. డ్రగ్స్ దందాపై తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విధ్వంసానికి దిగారని మండిపడ్డారు. తనపై నమోదైన అ్ని కేసుల గురించి న్యాయస్థానాల్లో తేల్చుకోవాలనుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని మాట్లాడినట్లుగా ఉన్న ఆ వీడియోలో తాను ఎక్కడికి వెళ్లానన్నది చెప్పలేదు కానీ.. బయటకు వెళ్లానని మాత్రం చెప్పారు. పట్టాభి విమానంలో వెళ్తున్న ఫోటోలను కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో పట్టాభి వీడియో విడుదల చేసినట్లుగా చేసినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్...

జగన్‌కు శత్రువుల్ని పెంచడంలో సాక్షి నెంబర్ వన్ !

ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్యను పెంచడంలో సాక్షి పత్రిక తనదైన కీలక భూమిక పోషిస్తుంది. ఎవరైనా తమను విమర్శిస్తున్నారో.. లేకపోతే టీడీపీకి మద్దతుదారుడని అనిపిస్తే చాలు వాళ్లపై పడిపోయి.....

‘జై హ‌నుమాన్‌’లో తేజా స‌జ్జా లేడా?

'హ‌నుమాన్తో' తేజా స‌జ్జా ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సీక్వెల్‌గా 'జై హ‌నుమాన్' రూపుదిద్దుకొంటోంది. ఇందులో తేజా స‌జ్జా ఉంటాడా, ఉండ‌డా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. నిజానికి ఈ సినిమాలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close