మత్స్యకారుల కోసం రంగంలోకి పవన్ !

జనసేన పార్టీ  20న మత్స్యకార అభ్యున్నతి సభను నర్సాపురంలో ఏర్పాటు చేసింది. దీనికి పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపల చెరువులపై మత్స్యకారులకు అధికారాలు తొలగించేలా ..వారి ఉపాధిని దెబ్బతీసేలా ఉన్న జీవో 217ను విడుదల చేసింది. దానికి వ్యతిరేకంగా జనసేన ఉద్యమం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మత్స్యకార గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఫిబ్రవరి 13 నుంచి మత్స్యకార గ్రామాల్లో అభ్యున్నతి యాత్ర నిర్వహిస్తారు.  ఫిబ్రవరి 20న సభ నిర్వహిస్తారు. పవన్ కల్యాణ్ హాజరవుతారు.

నిజానికి గత నవంబర్‌లో ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజునే దీన్ని నిర్వహించాలని అనుకున్నారు. కానీ అప్పుడు వర్షాల కారణంగా వాయిదా పడింది. మత్స్యకార సొసైటీల పేరుతో అన్నీ దళారుల చేతుల్లో ఉన్నాయని అందుకే జీవో తీసుకొచ్చి వేలం వేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేపల చెరువుల్ని వైసీపీ నేతలు తమ అధీనంలోకి తీసుకోవడానికే  చేపల చెరువుల హస్తగతానికే బహిరంగ వేలం విధానాన్ని తెచ్చి, మత్స్యకారుల నోటికాడ కూడు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కూడా మత్స్యకారులకు భరోసా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే మత్స్యకారులు ఈ జీవోపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  మత్స్యకారులకు మద్దతు పలికి పవన్ కల్యాణ్ వారిని జనసేనకు దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close