పవన్ సినిమా బడ్జెట్ వంద కోట్లు ..?

పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలతో బిజీ కానున్నారు. ఆయన చేయబోయే సినిమాల ప్రణాళిక సిద్దమైయింది. ఇప్పటికే ఒక సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. బాలీవుడ్ లో విమర్శల ప్రసంశల అందుకున్న ‘పింక్’ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు పవన్. దీనితో పాటు దర్శకుడు క్రిష్ తో సినిమా ఏర్పాట్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కధని ఓకే చేశారు పవన్. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తారు. ఇదో జానపద కధ. లేటెస్ట్ ఆప్దేట్ ఏమిటంటే.. ఈ సినిమా బడ్జెట్ దాదాపు వందకోట్లు వుంటుదని తెలిసింది.

కధ ప్రకారం.. సినిమాకి చాలా సెట్ వర్క్ అవసరమౌతుంది. బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యంలా ఓ రాజ్యాన్ని నిర్మించాల్సి వుంటుదట. పెద్దపెద్ద రాజదర్బార్లు, కోటలు.. గుర్రపు స్వారీ లు, కత్తి యుద్దాలు ఇందులో కనిపించబోతున్నాయి. దానితో పాటు సిజీ వర్క్ కి కూడా ప్రాధాన్యత కూడా వుందట. దానితో పాటు ఈ సినిమాకి ప్యాన్ ఇండియా ఇమేజ్ ని తీసుకువచ్చేలా ప్లాన్ జరుగుతుంది. హిందీ మినహా మిగిలిన భాషల్లోనూ విడుదల చేసే ఆలోచన వుంది

వందకోట్లు అంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ సినిమా అవుతుంది. అటు క్రిష్ కి కూడా. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం క్రిష్ విషయంలో చాలా నమ్మకంగా వున్నారు. క్రిష్ కి అటు బాలీవుడ్ లో కూడా మంచి పేరుంది. ముఫ్ఫై కోట్ల బడ్జెట్ తో ‘గద్దర్ ఈజ్ బ్యాక్’ సినిమా తీసి వందకోట్లు వసుళ్ళూ రాబట్టిన రికార్డ్ క్రిష్ వుంది. అలాగే మణికర్ణిక లాంటి హిస్టారికల్ సినిమా తీసిన అనుభవం క్రిష్ సొంతం. అందుకే అటు నిర్మాత ఏయం రత్నం కూడా ఖర్చు విషయంలో వెనకడుగువేయడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close