జనసేన గురించి లగడపాటి సర్వే ల పై స్పందించిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఏలూరు బహిరంగ సభ జనసంద్రమైంది. నిన్న దెందులూరులో చింతమనేని పై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ ఇవాళ కూడా అదే జోరు కొనసాగించారు. అలాగే జనసేన ఓట్ బ్యాంక్ గురించి జనసేన బలం గురించి లగడపాటి సర్వే లు అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు పవన్ కళ్యాణ్.

జనసేన పార్టీకి కేవలం 4 శాతం, లేదంటే 5 శాతం మాత్రమే ఓట్లు ఉన్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు పవన్ కళ్యాణ్. అలాగే కొంతమంది లగడపాటి సీక్రెట్ సర్వేలు అంటూ, జనసేన బలాన్ని కించపరిచే విధంగా వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. లగడపాటి కొన్ని నెలల క్రితం తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికి తన ఇంటికి వచ్చాడు అని, ఆ సందర్భంలో జనసేన పార్టీ బలం గురించి ఆయనతో చర్చించడం జరిగిందని, జనసేన పార్టీ సహాయం లేకుండా ఆంధ్రప్రదేశ్ లో 2019 లో ఏ ప్రభుత్వం ఏర్పడ లేదని, జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి గా ఉంటుంది అని తనతో చెప్పాడని, కావాలంటే మీరు వెళ్లి లగడపాటి తో చెక్ చేసుకోవచ్చని పవన్ కళ్యాణ్ చెప్పారు.

అలా ప్రభుత్వంలో భాగస్వామి కావాలంటే కనీసం 18 శాతం ఓటు బ్యాంకు ఉండాలని, తమకు అలా లగడపాటి లెక్కల ప్రకారం చూసుకున్నా, 18 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్టేనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. నిజంగా మనకు కేవలం వాళ్ళన్నట్టు 4 శాతం నుంచి 5 శాతం మాత్రమే ఓట్లు ఉండి ఉంటే తమను అసలు ఈ పార్టీలు పట్టించుకుని ఉండేవి కావని వివరించాడు పవన్ కళ్యాణ్.

ఏది ఏమైనా, లగడపాటి సర్వే అంటూ పేరు చెప్పి జనసేన పార్టీ పై మరొకరు దుష్ప్రచారం చేయకుండా పవన్ కళ్యాణ్ చెక్ పెట్టినట్టే అని చెప్పవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close