చంద్రబాబుకు పవన్ ఫోన్..!

ఇసుక కొరతపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో నిర్వహించబోయే మార్చ్ ఫాస్ట్‌కు.. అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి.

ఇసుక సమస్య పరిష్కారానికి అన్ని రాజకీయ పక్షాలు కలసికట్టుగా పోరాడాలని.. పిలుపునిస్తూ… అన్ని పార్టీల అగ్రనేతలకు ఫోన్లు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఫోన్ చేశారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ, తులసిరెడ్డి, సంపత్ రావు, డి.వి.వి.ఎస్. వర్మలకు ఫోన్ చేశారు. పార్టీలో చర్చిస్తామని కాంగ్రెస్, వామపక్షాలు, లోక్ సత్తా, బి.ఎస్.పి. నేతలు హామీ ఇచ్చారు.

ఇసుక సమస్య పరిష్కారంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చొరవ తీసుకున్నామని… నవంబర్ 3వ తేదీన విశాఖపట్నం లో జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్‌కి సంఘీభావం ప్రకటించాలని పవన్ అందర్నీ కోరుతున్నారు. మార్చ్ ఫాస్ట్ ను అత్యంత భారీగా నిర్వహించి… ప్రభుత్వం మెడలు వంచాలన్న లక్ష్యంతో.. పవన్ కల్యాణ్ ఉన్నారు. అందుకే అన్ని పార్టీలనూ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పార్టీలూ కలసి పోరాడాలని కొద్ది రోజుల కిందట పిలుపునిచ్చిన ఆయన.. ఆ దిశగా తనే ముందడుగు వేశారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రత్యక్షంగా 17.80 లక్షల మంది.. పరోక్షంగా మరో 17 లక్షల మంది ఉపాధి కోల్పోయారని .. పవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే విపక్ష పార్టీలన్నీ… ఇసుక కోసం.. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. రోజువారీగా అన్ని పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి. టీడీపీ నేత నారా లోకేష్ గుంటూరు… కలెక్టరేట్ ఎదుట ఒక్క రోజు నిరాహారదీక్ష చేశారు. వామపక్షాలు చాలా ఉద్ధృతంగా రోడ్డెక్కి పోరాటాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ అందరి మద్దతును కూడగట్టి.. ఓ బెంచ్ మార్క్ లాంటి మార్చ్ ఫాస్ట్ ను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో.. అన్ని పార్టీలదీ ఒకే మాట కాబట్టి.. పవన్ కల్యాణ్ తీసుకుంటున్న చొరవతో.. ఈ కార్యక్రమంలో అన్ని భాగస్వాములయ్యే అవకాశం ఉంది. అన్ని పార్టీలు కలిస్తే.. మూడో తేదీ విశాఖలో భారీ ర్యాలీ జరిగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close