పవన్ కళ్యాణ్, రామ్ మాధవ్ భేటీ

ప్రస్తుతం తానా సభల కోసం అమెరికాలో ఉన్న పవన్ కళ్యాణ్, బిజెపి వ్యూహకర్త రామ్ మాధవ్ తో భేటీ అయ్యారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఈ భేటీ లో చర్చ జరిగి ఉంటుందనే విషయం మీద ఆసక్తి నెలకొంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనే వ్యూహం తో ముందుకు వెళ్తున్న బిజెపి, అందుకు అవసరం అయ్యే ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోవడం లేదు. ఇటీవలే చిరంజీవిని బిజెపిలోకి ఆహ్వానించినప్పటికీ, రామ్ మాధవ్, కన్నా లక్ష్మీనారాయణ ల నుండి వచ్చిన ఆ ప్రతిపాదనకు చిరంజీవి సానుకూలంగా స్పందించలేదు. రాష్ట్రంలోని ఒక బలమైన సామాజిక వర్గం దన్నుగా ఉన్నప్పటికీ, వాటిని ఓట్లు గా మలుచుకోవడంలో అటు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా, ఇటు పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా విఫలం కావడంతో బిజెపి వ్యూహకర్తలు అదే సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ మాధవ్, పవన్ కళ్యాణ్ ల బేటి రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది.

అయితే ఇప్పటికే జనసేన ని ఏ పార్టీలోకి విలీనం చేసేది లేదని, తన శ్వాస ఉన్నంతవరకు జనసేన పార్టీని నిలబెట్టుకుంటానని పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పిన దరిమిలా రామ్ మాధవ్ పవన్ కళ్యాణ్ తో ఏమి చర్చించి ఉంటారని ఆసక్తి నెలకొంది. కొత్త ప్రభుత్వం నెలరోజుల పాలన మీద, విభజన హామీల మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మీద కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీ లో అధికారికంగా చెబుతున్న ఈ అంశాలే కాకుండా ఇతర రాజకీయ చర్చ కూడా వచ్చి ఉంటుందని అందరూ ఊహించ గలిగినప్పటికీ, అది ఏ అంశాలమీద అన్నది మాత్రం ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు.

ఏది ఏమైనా తానా సభల కేంద్రం గా జరుగుతున్న ఈ భేటీ ఏ కొత్త రాజకీయ సమీకరణలకు దారి తీస్తుంది అనేది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close