వైసిపి గూండాయిజాన్ని దుయ్యబడుతూ పవన్ స్పీచ్, బిజెపి జనసేన లో జోష్

తిరుపతి ఉప ఎన్నిక లో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిలబడిన రత్నప్రభ కోసం ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ తిరుపతి వచ్చారు. బిజెపి జనసేన జైత్రయాత్ర పేరిట జరిగిన ఈ సభ గ్రాండ్ సక్సెస్ కావడం తో బిజెపి జనసేన లో జోష్ వచ్చింది. పవన్ స్పీచ్ వైఎస్ఆర్ సీపీ నేతల గుండాయిజం ని హైలెట్ చేస్తూ మాట్లాడటం, వారి రౌడీయిజానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలను కోరడం, విశేషంగా ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళితే..

ఈరోజు ఉపఎన్నిక వైసీపీ ఎంపీ అభ్యర్థి కాలం చేయడం వల్ల వచ్చిందని, అయితే ముందుగా చనిపోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెబుతూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు పవన్ కళ్యాణ్. తమ పార్టీకి చెందిన దళిత ఎంపీ చనిపోయినా జగన్ ఆయనను పరామర్శించడానికి రాకపోవడం తెలిసిందే.

రెండు వందల ఏళ్ల పాటు ఎంతోమంది కష్టపడి పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని, కానీ కొంతమంది నాయకులు మాత్రం ఈ స్వతంత్రం తమ అబ్బ సొత్తు అన్నట్లు ప్రవర్తిస్తున్నారని అంటూ ఉపన్యాసాన్ని పరుగులు పెట్టించారు పవన్ కళ్యాణ్.

పులివెందుల అంటే ఫ్యాక్షన్ రాజకీయానికి పర్యాయపదంగా మార్చేశారు

పులివెందుల గొప్పదనం ప్రజలకు తెలియదని, 19వ శతాబ్దంలోనే పులివెందులలో సరస్వతి నిలయం అనే లైబ్రరీ ఉండేదని, రాష్ట్రంలో ఎన్నో చోట్ల లైబ్రరీలు లేని సమయంలో నే అక్కడ లైబ్రరీ ఉండేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అదే పులివెందుల ని రౌడీల అడ్డా గా మార్చారని, పులివెందుల అనే పేరు ఫ్యాక్షన్ రాజకీయాలకు మారుపేరుగా మార్చారని పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ సిపి నేతలు మహిళలపై దాడులు చేస్తున్నారని , మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దీనికి తోడు ముస్లిమ్స్ కు ఇవ్వవలసిన ఈద్గా స్థలం విషయంలో ఇటీవల అనవసరమైన రాజకీయాలు చేసి, సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం వైఎస్ఆర్ సిపి నేతలు చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

వైఎస్ఆర్ సీపీ నేతలు సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నారు:

ఆంధ్ర ప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారి పోయిందో చెప్తాను అని పవన్ కళ్యాణ్ అంటూ, ప్రతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఒక గూండా లాగా మాట్లాడుతున్నాడని, బెదిరించడం గుండాయిజం చేయడం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు పరిపాటిగా మారిందని, అయితే పవన్ కళ్యాణ్ వీరి బెదిరింపులకు భయపడడు అని పవన్ వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వారిని ఎదిరించిన ఈ నేలలో, రాయలవారు ఏలిన ఈ నేలలో, యువత వైఎస్ఆర్సిపి గుండాలకు భయపడవలసిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

ఆరు నెలల పాటు కత్తిసాము కర్రసాము నేర్చుకున్న వ్యక్తి, 60 ఏళ్ల ముసలమ్మ మీద దాడి చేశాడట అన్న సామెత చెప్పినట్లు, 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలను గెలిపిస్తే, వైయస్సార్ సిపి నాయకులు ఆ బలాన్ని సామాన్యుల మీద ప్రయోగిస్తున్నారని, రేషన్ కార్డులు కట్ చేస్తామని ప్రజలను బెదిరిస్తున్నారని, తిరుపతి కొండపై ఒక కులస్తుల షాప్స్ తీసి వేస్తున్నారని, ఇదేం న్యాయమని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

వైయస్ వివేకా హత్య కేసు చేదించలేని చేతకాని ప్రభుత్వం:

ఇటీవల ముఖ్యమంత్రి చిన్నాన్న కూతురు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిందని గుర్తు చేస్తూ, సొంత చిన్నాన్న హత్య కేసు లో నిందితులని పట్టుకోలేని ముఖ్యమంత్రి, సామాన్యులకు ఏమాత్రం న్యాయం చేయగలరు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ మాటలు తాను అన్నవి కాదని, వివేకానంద రెడ్డి కూతురు సునీత అన్న మాటలే అని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. దోషులు ఎవరో తెలిసి కూడా జగన్ ప్రభుత్వం వారిని పట్టుకోవడం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పై కత్తి దాడి జరిగితే, దాన్ని ఎంతో రాజకీయం చేసిన జగన్ రెడ్డి, ఎన్నికల తర్వాత ఆ కేసుని ఏం చేశారో చెప్పాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ సంఘటన జరిగి రెండు సంవత్సరాలు అయినప్పటికీ జగన్ ప్రభుత్వంలో ఆ కేసు లో పురోగతి లేదు అంటే రాజకీయాలు ఎంతగా భ్రష్టు పట్టి పోయాయి అన్నది అర్థం అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే వారిని ఈ ప్రభుత్వం పట్టుకోలేక పోయింది పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

శేషాచలం అడవుల్లో వైఎస్ఆర్సిపి ప్రోద్బలంతో స్మగ్లింగ్:

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ యధేచ్ఛగా జరుగుతోందని, ఇదివరకు ఎర్రచందనం స్మగ్లింగ్ కేవలం దుంగల్లో జరిగితే ఇప్పుడు నేరుగా లారీ లలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అధికార వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం స్మగ్లర్లకు అండగా నిలబడుతోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డోర్ డెలివరీ అవుతుందో లేదో తెలియదు కానీ ఎర్రచందనం మాత్రం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆధ్వర్యంలో చైనాకు డోర్ డెలివరీ అవుతుందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. వృక్షో రక్షతి రక్షితః అంటారని, వైఎస్ఆర్ సీపీ నేతలు కూల్చే ప్రతి ఎర్రచందనం దుంగ, వైయస్సార్సీపి పతనానికి ఒక మెట్టు అవుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

యువత ధైర్యంగా నిలబడాలని, జంకకుండా ఓటు వేయాలని, తిరుపతి ఉప ఎన్నికలో విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన రత్నప్రభ ని గెలిపించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close