బిజెపి జనసేన జైత్రయాత్ర సభ, భారీగా దెబ్బ కొట్టిన తెలుగు మీడియా

బిజెపి జనసేన జైత్రయాత్ర పేరిట ఈ రోజు తిరుపతిలో భారీ సభ నిర్వహించాయి బిజెపి జనసేన పార్టీలు. వేలాది మంది జనం ఈ సభకు వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీ పై పదునైన విమర్శలు చేశారు. అయితే ఈ ప్రోగ్రాం అంతటినీ ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా మాత్రమే తెలుసుకోవలసి వచ్చింది. ఏదైనా ఊరిలో 100 మంది గుమికూడితే వార్తగా ఇచ్చే ప్రధాన చానల్స్ అన్ని, వేలాది మంది హాజరైన ఈ కార్యక్రమాన్ని పూర్తి గా పక్కన పెట్టేశాయి. వివరాల్లోకి వెళితే..

పవన్ కళ్యాణ్ సభ లని, స్పీచ్ ల ని ప్రధాన ఛానెల్స్ పక్కన పెట్టడం ఇవాళ కొత్తేమీ కాదు. ఉన్న ఛానెల్స్ లో సగం టీడీపీ కి పూర్తి అనుకూలంగా, మరి కొన్ని ఛానెల్స్ అధికార వైఎస్సార్సీపీ కి అనుకూలంగా నడుచుకుంటూ ఉంటాయి అన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇకపోతే మిగిలిన చానల్స్ ని కూడా అధికార పార్టీ నేతలు – కుదిరితే ప్రలోభపెట్టడం, లేదంటే బెదిరించడం ద్వారా జనసేన వాణి ప్రజల్లోకి వెళ్లకుండా బలంగా కృషి చేస్తున్నారు అన్న అభిప్రాయం జనసేన అభిమానుల లో ఉంది. తాజాగా ఇవాళ జరిగిన సభని ప్రధాన చానల్స్ పూర్తిగా అవాయిడ్ చేయడం కూడా ఇదే కోవలోకి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కీలకమైన సమయంలో తెలుగు చానల్స్ తమను భారీగా దెబ్బతీశాయి అని వారు భావిస్తున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తమ పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జనసైనికులు కష్టపడుతున్నారు. జన సేన అధినేత ఉపన్యాసాలు ప్రజల్లోకి వెళితే తమ పార్టీకి ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంతోనే అధికార పార్టీ నేతలు ఈ విధంగా చేస్తున్నారని జనసేన అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

1999లో వచ్చిన ఒకే ఒక్కడు అన్న సినిమాలో ఒక జర్నలిస్టు ముఖ్యమంత్రిని ని ప్రశ్నించే సన్నివేశానికి అప్పట్లో ప్రేక్షకులు విజిల్స్ వేశారు. 2018 లో వచ్చిన భరత్ అనే నేను సినిమా లో ఒక ముఖ్యమంత్రి మీడియా ఛానల్స్ కు, పత్రికలకు గడ్డి పెట్టే సన్నివేశానికి ప్రేక్షకుల నుండి అంతకంటే ఎక్కువ స్పందన వచ్చింది. గత రెండు దశాబ్దాలలో జర్నలిజం విలువలు ఎంత దారుణంగా పడిపోయాయి అనే దానికి ఒకరకంగా ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఏది ఏమైనా అధికారంలో ఉన్న పార్టీ ప్రలోభాలకు , లేదంటే బెదిరింపులకు మీడియా తలొగ్గడం ప్రజాస్వామ్యంలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close