దుబ్బాకలో ప్రచారానికి పవన్ కల్యాణ్..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జనసేన పార్టీ కన్నా.. బీజేపీ గురించే ఎక్కువ ట్వీట్లు.. ప్రకటనలు చేస్తున్న ఆయనను గరిష్టంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి . బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. గతంలోనూ ఆయన అక్కడ పోటీ చేశారు. గ్రామగ్రామన ఆయన అనుచరణగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికే తెలంగాణకు చెందిన ముఖ్యనేతలతా దుబ్బాకపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వ్యూహాలు రచిస్తున్నారు. ఆరెస్సెస్ వర్గాలు కూడా రంగంలోకి దిగాయి. ప్రచారానికి ఊపు రావాలంటే… ఓ సూపర్ స్టార్ వస్తే బాగుటుందని అంచనా వేస్తున్నారు. ఆ సూపర్ స్టార్ పవన్ కల్యాణ్ అయితే బాగుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ దిశగా పవన్ కల్యాణ్‌ను ఒప్పించేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత బండి సంజయ్… పవన్ కల్యాణ్ ను కలిశారు. కలిసి పని చేస్తామని ప్రకటించారు. పవన్ సేవల్ని ఉపయోగించుకుంటామని అప్పుడే చెప్పారు.

దీనికి తగ్గట్లుగా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కూడా.. ఖాళీగానే ఉన్నారు. ఆయన సినిమాల షూటింగ్‌లు ఇంకా ప్రారంభం కాలేదు. ఒకటి లేదా రెండు రోజుల సమయం కేటాయించినా చాలని తెలంగాణ బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ పెద్దలు ఓ మాట చెబితే పవన్ ప్రచారానికి వెళ్లడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు దుబ్బాక ప్రచారానికి వెళ్తే తర్వాత గ్రేటర్ ఎన్నికల్లోనూ పవన్ జోరు ప్రచారాన్ని చూడొచ్చని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close