పదిహేనో తేదీన రాజధాని గ్రామాలకు పవన్ ..!

పదో తేదీ తర్వాత అమరావతిలో పర్యటిస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఆ మేరకు పదిహేనో తేదీన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఆ రోజున రాజధాని గ్రామల్లో పర్యటించి.. రైతులకు సంఘిభావం తెలియచేయనున్నారు. గతంలో చలో అసెంబ్లీ సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన వారు.. జనసేన ఆఫీసుకు వచ్చి పవన్ ను కలిశారు. నిజానికి చలో అసెంబ్లీ జరిగినప్పుడే… రాజధాని గ్రామాలకు వెళ్లేందుకు పవన్ సిద్ధమయ్యారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు వ్యవహారంతో… ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

అమరావతిపై కలిసి పోరాడాలని నిర్ణయించుకున్న రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో.., ఎవరూ ముందడుగు వేయలేని పరిస్థితి. ఈ పొత్తుపై ప్రజల్లో సందేహాలు ఏర్పడటం… తన అమరావతి పోరాటానికి ఆటంకంగా మారడంతో… పవన్ కల్యాణ్.. సొంతంగా.. రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటన సమాచారం.. బీజేపీకి కూడా పంపలేదని తెలుస్తోంది. బీజేపీ కూడా పవన్ గురించి పెద్దగా పట్టించుకోకుండా..తమ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించాలని నిర్ణయించుకుంది.

ఇప్పుడు అమరావతి విషయంలో… రెండు పార్టీలు వేర్వేరు దారుల్లో వెళ్తున్నట్లుగా .. రెండు పార్టీల నేతలు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. పొత్తు పేరుతో హడావుడి చేసిన రెండు పార్టీల మధ్య ఇప్పుడు సమన్వయ కమిటీ సమావేశాలు కూడా జరగడం లేదు. అమరావతి పోరాటాన్ని కలిసి చేద్దామనే ఆలోచన చేయడం లేదు. బీజేపీ ఏమనుకున్నా… కలసి రాకపోయినా… తన పర్యటనను ఆపకూడదని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close