పుష్కరాలకు పోటెత్తిన భక్తులు: హైవేలపై గంటలపాటు ట్రాఫిక్ జామ్‌లు

హైదరాబాద్: శని, ఆదివారాలు వరసగా సెలవులు రావటంతో తెలుగు రాష్ట్రాలు రెండింటిలో గోదావరి పుష్కరాలకు జనం పోటెత్తారు. అటు ఏపీలో రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లులలోని పుష్కర ఘాట్‌లు, ఇటు తెలంగాణలో  అదిలాబాద్ జిల్లాలోని బాసరనుంచి ఖమ్మంజిల్లాలోని భద్రాచలంవరకు ఉన్న పుష్కర ఘాట్‌లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అంచనాలకు మించి ప్రయాణీకులు వస్తుండటంతో రెండు రాష్ట్రాలలోనూ అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయటానికి కిందా మీదా పడుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే మరోవైపు పుష్కరఘాట్‌లకు వెళ్ళే జాతీయ రహదారులపై విపరీతంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్‌లు పుష్కరాలకు బయలుదేరిన భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. బస్సులు, రైళ్ళు పుష్కర భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దానికితోడు వ్యక్తిగత వాహనాలుకూడా లక్షలసంఖ్యలో రోడ్డెక్కాయి. పలువురు వీఐపీలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి, ఇటు హైదరాబాద్-నిజామాబాద్ హైవేలపై ట్రాఫిక్ విపరీతంగా ఉంది. రాజమండ్రి దగ్గరయితే ఒకదశలో ఆరు కిలోమీటర్లమేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.టోల్ గేట్లు, చెక్ పోస్టులవద్ద వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోవటంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టోల్ గేట్లవద్ద టోల్ వసూళ్ళు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛందసంస్థలు సహాయానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కూడా టోల్ గెేట్లవద్ద నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ ఉదయం పుష్కరాలకు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్‌లవద్ద 24గంటలూ గజఈతగాళ్ళను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రోడ్లపై రద్దీ క్లియరెన్స్‌కు చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలద్వారా మళ్ళించాలని సూచించారు. ధర్మపురి, కాళేశ్వరం, ఏటూరునాగారం, భద్రాచలం రహదారులలో ఎక్కడి కక్కడ పలుసార్లు ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close