అమరావతిలో మానవహక్కుల ఉల్లంఘన.. ఐరాస.. అమ్నెస్టీల్లోనూ పిటిషన్లు..!

అమరావతిలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలని ఎన్నారైలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయా సంస్థలు స్పందించినా.. స్పందించకపోయినా.. ఫిర్యాదులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో కావటి శ్రీనివాస్ అనే ఎన్నారై పిటీషన్ వేశారు. ఈ పటిషన్ ను తాము రిసీవ్ చేసుకున్నట్లు న్యాయస్థానం శ్రీనివాస్ కు లేఖ కూడా పంపంది. శ్రీనివాస్ బృందం ఐక్యరాజ్య సమితిలోనూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన, మహిళలపై జరుగుతున్న దాడుల పై వీడియో సాక్ష్యాలను ఆ పిటిషన్‌కు జత చేశారు.

అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగుతోందని ఎన్నారైలు అంటున్నారు. కావటి శ్రీనివాస్ వేసిన పిటీషన్ ను ప్రత్యేక ప్రక్రియ ద్వారా పరిశీలిస్తామని.. యునైటెడ్ నేషన్స్ అధికారులు హామీ ఇచ్చారు. అమరావతిలో మానవహక్కుల ఉల్లంఘన పై లండన్ లోని ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ లో కూడా పిటిషన్ వేసేందుకు కావటి శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న వ్యవహారాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని ఎన్నారైలు చెబుతున్నారు.

అమరావతి రాజధానిగా ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఎన్నారైలు పెట్టుకున్న అంచనాను… కొత్త ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దాంతో.. అమరావతి కోసం … పోరాడాలని నిర్ణయించుకున్నారు. రైతులకు మద్దతుగా ఉండాలని తమ వంతు పోరాటం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లి.. ఏపీ సర్కార్ పై ఒత్తిడి పెంచాలనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close