ట్యాపింగ్ కేసులో ఏడాదిన్నరగా అమెరికాలో ఉంటున్న మాజీ పోలీసు అధికారి ప్రభాకర్ రావు ఇండియాకు రానున్నారు. ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. పాస్ పోర్టు రద్దు చేశారు. డిపోర్టేషన్ ఏర్పాట్లు చేస్తున్నారు. తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని అమెరికాలో ఆయన పెట్టుకున్న పిటిషన్లను కొట్టేశారు. దీంతో అన్ని దారులు మూసుకుపోయాయి. చివరికి తన పాస్ పోర్టు ఇప్పిస్తే తానే వస్తానని.. పాస్ పోర్టు ఇచ్చిన మూడు రోజుల్లో ఇండియాకు వస్తానని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఆయనకు చాన్సిచ్చింది. పాస్ పోర్టు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. మూడు రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాకు రానున్నారు.
ప్రభాకర్ రావు ఇండియాలో ల్యాండ్ కాగానే పోలీసులు అదుపులోకి తీసుకోవడం కామనే. ఇప్పటికే శ్రవణ్ రావు అనే మరో నిందితుడు కూడా ఇండియాకు వచ్చారు. అయనను పలుమార్లు ప్రశ్నించారు. వేరే కేసులో అరెస్టు చేశారు. ఇప్పుడు ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి రక్షణ లేదు. అందుకే అరెస్టు చేస్తారు. గతంలో వీరిద్దరూ ఇండియాకు వచ్చిన మరుక్షణం కేసీఆర్ ను అరెస్టు చేస్తామని రేవంత్ ప్రకటించారు. ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు వచ్చేశారు..మరొకరు వస్తున్నారు.
ట్యాపింగ్ కేసులో అంతా.. ప్రభాకర్ రావు , కేసీఆర్ చెప్పినట్లే చేశామని..ఇతర నిందితులు చెప్పారు. ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్పే విషయాలు కీలకం కానున్నాయి. ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ లను అరెస్టు చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ట్యాపింగ్ ను నిరూపించడం అంత ఈజీ కాదు. మరి ఏం చేయబోతున్నారన్నది కీలకంగా మారనుంది.