మళ్ళీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్న ప్రధాని మోడి

ఈ ఏడాదిలో ఎన్నికలు జరుగబోయే కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో అప్పుడే ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడి సిద్దమయిపోతున్నారు. మంగళవారం ఆయన ఆ రెండు రాష్ట్రాలలో పర్యటించబోతున్నారు. కేరళలోని కోజిక్కోడ్ లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొన్న తరువాత, అక్కడి నుండి తమిళనాడులోని కోయంబత్తూరు చేరుకొని అక్కడ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఉత్తరభారతంలో చాలా మంది ప్రజలకు హిందీ అర్ధం చేసుకోగలరు కనుక మోడీ వారిని ఆకర్షించి, ప్రబావితం చేసే విధంగా అనర్గళంగా మాట్లాడి ఒప్పించగలుగుతారు. కానీ మోడీ వంటి మంచి వాగ్ధాటి గల నేతలకి కూడా దక్షిణ భారతదేశంలో బాషే ఒక ప్రధాన అడ్డంకిగా మారుతుంది. వారు చెప్పిన దానిని అనువాదకులు స్థానిక బాషలోకి అంతే సమర్ధంగా అనువదించి ఆకట్టుకోవడం కొంచెం కష్టమే కనుక ఉత్తరాది ప్రజలపై చూపినంత ప్రభావం దక్షిణాది ప్రజలపై చూపడం కష్టం.

ఇక తమిళనాడు, కేరళలో చాలా కాలంగా రెండే పార్టీలు, కూటములు అధికారం చెలాయిస్తున్నాయి. ఏ పార్టీ అయినా వాటితో చేతులు కలిపి మనుగడ సాగించాల్సిందే తప్ప వాటిని డ్డీ కొని ఓడించిన దాఖలాలు లేవు. తమిళనాడులో అన్నాడిఎంకె, డిఎంకె పార్టీలు, కేరళలో వామపక్షాల నేతృత్వంలో లెఫ్ట్ డెమొక్రేటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రేటిక్ ఫ్రంట్ చేతుల్లోనే అధికార మార్పిడి జరుగుతుంది. కనుక ఆ రెండు రాష్ట్రాలలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడి బీజేపీని గెలిపించడం మాట అటుంచి, ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తులు పెట్టుకోకపోతే కనీసం గౌరవప్రదమయిన స్థానాలు సంపాదించుకోవడం కూడా కష్టమే. మరి ఈ పరిస్థితులలో ప్రధాని నరేంద్ర మోడి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ రెండు రాష్ట్రాలలో ఏవిధంగా నెగ్గుకు వస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close