మోడీ ప్రత్యక్షంగా ఏపీకి రావట్లేదు..! కానీ ప్రసంగాలు మాత్రం రెండు సార్లున్నాయ్..!

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ… నేరుగా ఆంధ్రప్రదేశ్‌కు రాక పోవచ్చు కానీ.. ఆయన తనదైన యాప్‌తో.. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి సందేశం అందించడానికి.. ఏర్పాట్లు చేసుకున్నారు. రెండో తేదీన, ఆరో తేదీన ఆయన తన “నమో యాప్‌”లో ఏపీ కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే.. ఏపీ కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. ఎవరెవరు మాట్లాడాలో… ఏమేమి మాట్లాడాలో కూడా ట్రైనింగ్ జరుగుతోంది. నమో యాప్ ద్వారా కార్యకర్తల్ని ఉద్దేసించి .. నరేంద్రమోడీ ప్రసంగించడం ఆషామాషీగా జరగడం లేదు. దానికో ప్రత్యేకమైన టీం ఉంది. టీమ్ ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేస్తుంది. కొద్ది రోజుల కిందట.. తమిళనాడు కార్యకర్తలు ఇచ్చిన షాక్‌తో ఇప్పుడు పూర్తిగా.. ఫార్మాట్‌ మార్చేశారు.

ఇప్పుడు నరేంద్రమోడీతో నమో యాప్‌ద్వారా మాట్లాడాలంటే.. బీజేపీకి చెందిన చోటా నేత అయి.. రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఏం మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలన్నదానిపై.. ఇన్ స్ట్రక్షన్స్‌ను కచ్చితంగా ఫాలో కావాలి. ప్రశ్నలు కూడా మోడీ టీం ఇస్తుంది. జవాబులు కూడా మోడీ టీం రెడీ చేస్తుంది..మోడీ ఇస్తారు. గత వారం వరకూ.. రూల్స్‌లో కాస్త ఫ్లెక్సిబులిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఉండటం లేదు. ఎందుకంటే.. తమిళనాడులో.. ఓ బీజేపీ నేత.. నేరుగా మోదీపైనే విరుచుకుపడ్డారు. నాలుగున్నరేళ్లలో మధ్యతరగతి ఏం చేశారో .. సూటిగా, సుత్తి లేకుండా చెప్పాలని ప్రశ్నించడంతో.. మోడీ నీళ్లు నమలాల్సి వచ్చింది. ఆ వీడియో… హైలెట్ అవడంతో.. చివరికి రాహుల్ గాంధీ కూడా ఎగతాళి చేశారు. దాంతో… ఇక నుంచి … నమో యాప్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడాలంటే.. ముందుగా… స్క్రిప్ట్ రెడీ చేయాలని నిర్ణయించారు.

మాట్లాడబోయేది ఏపీ కార్యకర్తలతో కాబట్టి.. కచ్చితంగా.. ఏపీ గురించే మాట్లాడతారు మోడీ. అందులో సందేహం లేదు. ఓ రకంగా.. తాను ఏపీకి వచ్చి బహిరంగసభల్లో ప్రసంగించాల్సిన మ్యాటర్‌ను అక్కడ వినిపించే అవకాశం ఉంది. నిరసనల్లాంటి అవకాశాలు లేవు కాబట్టి.. వన్ సైడ్‌గా తాను చెప్పాలనుకున్నది చెబుతారు. ఏం చెబుతారన్నదే ఆసక్తి కరం. విభజన హామీల గురించి చెబుతారా..? ఏపీలో అవినీతి జరుగుతోందని చెబుతారా..? లేక పోతే.. ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ అయినప్పటికీ.. ఇప్పుడు టీడీపీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందని చెబుతారా..? అన్నదే ఆసక్తికరం. ఏం చెప్పినా బీజేపీ కార్యకర్తలతోనే…! ఏ మ్యాటర్ అయినా.. అది.. ముందుగానే స్క్రిప్టింగ్ కాబట్టి.. చెప్పాలనుకున్నదే చెబుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close