సజ్జనార్.. ది ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్..!

“దిశ” జరిగిన అన్యాయం దేశంలో మరో ఆడపిల్లకు జరగకూడదంటే.. బియాండ్ ది లా ఆలోచించాలి. దేశంలో ఉన్న చట్టాలు.. ప్రస్తుతానికైతే.. నిందితులకు భయం పుట్టించడం లేదు. వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్న భారత లా మౌలిక సూత్రం… నేరస్తులు.. తప్పించుకోవడానికి కారణం అవుతోంది. ఈ క్రమంలో.. పోలీసులే అప్పుడప్పుడూ.. న్యాయం చేయాల్సి వస్తోంది. ఇలాంటి న్యాయం చేయడంలో.. ఐపీఎస్ సజ్జనార్ ముందున్నారు. అమ్మాయిలపై దాడులకు పాల్పడిన వారికి క్యాపిటల్ పనిష్మెంట్‌ని.. తనదైన శైలిలో చట్టపరిధిలోనే అమలు చేసి.. శభాష్ అనిపించుకుంటున్నారు.

నాడు వరంగల్ యాసిడ్ బాధితులకు ఇన్‌స్టంట్ న్యాయం..!

సీపీ సజ్జనార్..కెరీర్‌లో ఇలాంటి సంచలన ఎన్‌కౌంటర్లు రెండో సారి. 2008లో వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా.. ఇలాంటి సంచలనాత్మక ఘటన ఒకటి జరిగింది. అదే యాసిడ్ దాడి. వంరగల్‌లో స్వప్నిక, ప్రణీత అనే యువతులపై శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. అతనికి మరో ఇద్దరు సహకరించారు. ఈ ఘటన 2008 డిసెంబరు 10న జరిగింది. ఈ ఘటనలో స్వప్నిక మరణించింది. ప్రణీతకు ఆ ఘటన.. ఇప్పటికీ.. వెంటాడుతూనే ఉంది. ఈ ఘటన జరిగిన తర్వాత.. రాష్ట్రం మొత్తం ఒక్క సారిగా గగ్గోలు రేగింది. ఆ నిందితులను అలా వదిలి పెడితే..యాసిడ్ దాడులు పెరిగిపోతాయన్న చర్చ జరిగింది. వెంటనే.. ఎస్పీగా ఉన్న సజ్జనార్.. చాన్స్ తీసుకోలేదు. నిందితులుగా ఉన్న మొత్తం ముగ్గుర్ని.. చట్టబద్ధంగా ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పటిలాగే… అప్పుడు కూడా తప్పించుకుని పోవడానికి నిందితులు ప్రయత్నించడంతో కాల్చేశారు. ఆ తర్వాత యాసిడ్ దాడులు చాలా వరకూ తగ్గిపోయాయని రికార్డులు కూడా చెబుతున్నాయి.

నేడు “దిశ”కు ఎనిమిది రోజుల్లోనే న్యాయం..!

సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్ కు.. పదకొండేళ్ల తర్వాత వరంగల్ లాంటి పరిస్థితే ఎదురయింది. ఏం చేయాలో.. ఆయనకు..అనుభవం ఉంది. ప్రజల నుంచి మద్దతు ఉంది. డిమాండ్ ఉంది. వరంగల్ న్యాయం ఇక్కడ అమలు చేసినా… ప్రశంసించేవారే తప్ప.. ఖండించేవారు ఉండరు. సజ్జనార్‌కు ఆ సపోర్ట్ సరిపోయింది. వారికి నిందితులు కూడా సహకరిచారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తమ తుపాకులను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఫలితంగా.. దిశకు న్యాయం జరిగిపోయింది.

భయం.. భయం పుడితేనే నేరాలు ఆగుతాయి..!

చట్టాలున్నది.. నేరాలు జరిగిన తర్వాత శిక్షించడానికి కాదు. నేరం చేస్తే.. ఫలానా శిక్ష పడుతుందని భయ పెట్టడానికే. అలా భయం పెరిగినప్పుడే.. ఆటోమేటిక్ గా నేరాలు తగ్గిపోతాయి. ఇండియన్ పీనల్ కోడ్‌లు… సీఆర్పీసీ.. కోర్టు విచారణలు ఇప్పుడు.. నేరస్తులకు భయాన్ని తగ్గిస్తున్నాయి. వాటన్నింటిపై భయాన్ని కల్పించాలంటే… కొన్ని చర్యలు తప్పడం లేదు. అలాంటి వాటిలో సజ్జనార్.. ముందు ఉంటున్నారు. దిశకు.. ఎప్పటికీ.. న్యాయం జరగదేమోనని… నిర్భయ లాంటి కేసుల్లో.. జరుగుతున్న జాప్యంతో దేశ ప్రజలు ఆందోళన చెందారు.
కానీ సజ్జనార్.. వాటన్నింటినీ పటాపంచలు చేశారు. న్యాయం చేశారు. శభాష్.. సీపీ సజ్జనార్ సార్..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close