ఢిల్లీ నుంచి జగన్ తిరుగుపయనం..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆకస్మికంగా ముగిసింది. నారాయణ అనే తన వ్యక్తిగత సహాయకుడు మరణించడంతో.. బాధాతప్త హృదయంతో..ఆయనకు నివాళి అర్పించడానికి ఢిల్లీలో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని జగన్ కడపకు పయనమయ్యారు. నారాయణ కుటుంబంతో.. వైఎస్ కుటుంబానికి మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. ఢిల్లీ నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడ్నుంచి నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు వెళ్తారు. నివాళి అర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత మళ్లీ అమరావతి చేరుకుంటారు.

గురువారం ఉదయం.. అనంతపురం జిల్లా పెనుకొండలో కియా పరిశ్రమను ప్రారంభించిన జగన్… హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లారు. హోంమంత్రి అమిత్ షా.. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్లు ఖరారయ్యాయన్న సమాచారం రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లినట్లు చెబుతున్నారు. తీరా ఢిల్లీకి వెళ్లే సరికి… ఎవరిక అపాయింట్‌మెంట్లు ఖరారు కాలేదు. అర్థరాత్రి వరకూ ఎదురు చూసినప్పటికీ.. అమిత్ షా ఇంటి గేట్లు తెరుచుకోలేదు. ఈ రోజు.. ప్రధాని మోడీతో సమావేశం ఉందని… వైసీపీ వర్గాలు ప్రచారం చేశాయి. ఆయన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన, అమ్మఒడి పథకాల ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారని చెప్పుకొచ్చారు. అయితే.. మోడీ అపాయింట్‌మెంట్ కూడా ఖరారు కాలేదని తెలుస్తోంది. అదే సమయంలో.. సహాయకుడు నారాయణ మృతి వార్త తెలియడంతో.. కడపకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పర్యటనలు.. అచ్చి రావడం లేదు. ఆయన ఎవరినైతే కలవాలని అనుకంటున్నారో.. వారందరూ చివరి క్షణంలో హ్యాండిస్తున్నారు. గతంలో ఢిల్లీ పర్యటనల్లోనూ అదే జరిగింది. తాజాగా అదే జరిగింది. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి సరైన టీమ్‌ను పెట్టుకోలేకపోయారని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి చేసిన కొన్ని ప్రకటనలు, పనుల వల్ల.. కేంద్రమంత్రులు ఆయనను దగ్గరకు రానివ్వడం లేదు. ఆయన పలుకుబడి పూర్తిగా తగ్గిపోవడం.. జగన్‌కు మైనస్‌గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close