కోడెల వర్థంతి చేయకూడదని పోలీసుల నోటీసులు..!

ఓ వైపు వైసీపీ నేతలు ఆసరా వారోత్సవాలు అని సభలు సమావేశాలు పెట్టి.. పిల్లల్ని పెద్దల్ని పోగేసి డాన్సులు చేస్తున్నారు. పోలీసులకు అప్పుడు కోవిడ్ నిబంధనలు గుర్తు రావడం లేదు. కానీ ఇతరులు మాత్రం ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నారని తెలిస్తే పోలీసులు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. వెంటనే నోటీసులతో వారి వద్దకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతల విషయంలో అయితే జెట్ స్పీడ్‌గా పని చేస్తున్నారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని ఎడాది గడిచింది. ఈ సందర్భంగా…బుధవారం ప్రథమ వర్థంతి జరగనుంది. ఇందు కోసం నరసరావుపేటలోని తన ఇంటి వద్ద కోడెల కుమారుడు శివరాం ఏర్పాట్లు చేసుకున్నారు.

సత్తెనపల్లి,నర్సరావు పేట నియోజకవర్గాల్లో పలు చోట్ల కోడెల అభిమానులు కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కోవిడ్ నిబంధనలు గుర్తు చేస్తూ కోడెల శివరాంకు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని అందులో హెచ్చరించారు. నిర్వహించబోతోంది పార్టీ కార్యక్రమం కాదని..కేవలం తన తండ్రి మొదటి వర్ధంతి అని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే.. కార్యక్రమాలు ఆపబోమని కోడెల శివరాం ప్రకటించారు.

కోడెల మృతి తర్వాత ఆయన కుటుంబసభ్యులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కోడెలపై కేసులు పెట్టి..పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన ప్రభుత్వం.. చివరికి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోనీయడం లేదన్న ఆగ్రహం ..కోడెల అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అమలు చేస్తే నిబంధనలు అందరికీ ఒకలానే అమలు చేయాలని… కొంత మందికే అమలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close