పోలీస్ వ్యవస్థ ఇంత నిర్వీర్యమైపోయిందేంటి!?

ఎస్పీపై దాడి చేస్తే ఆయనను కాపాడుకోవడానికి పోలీసులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. దూసుకొచ్చిన ఆందోళనకారులకు ఇంత కన్నా ధైర్యం ఇచ్చే ఘటన ఏముంటుంది..? ఎస్పీనే గాయపడిపారిపోయారనుకున్న తర్వాత విధ్వంసకారులు రెచ్చిపోయారు. పోలీసులు చేతులెత్తేశారు. ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. జిల్లాకు పేరు పెట్టాలని గతంలో ఉద్యమం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా పేరు మారుస్తూ జీవో జారీ చేసింది. ప్రజలందరితో చర్చించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపించింది.

రాజకీయ అవసరాల కోసం మరింత పెంచుతూ.. పాలకులే వ్యూహాలు అమలు చేస్తూండటంతో ప్రజలు నలిగిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమలాపురంలో వ్యవస్థీకృతంగా దాడులు జరిగాయి. ముందుగా కలెక్టరేట్ పై.. ఆ తర్వాత మంత్రులు.. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు జరిగాయి. ఇంత జరుగుతున్న విషయాన్ని పోలీసులు కనీసం గుర్తించలేకపోయారు. పోలీస్ ఇంటలిజెన్స్ వ్యవస్థ ఈ విషయంలో ఘోరంగా ఫెయిలయిందన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఇంతపెద్ద విధ్వంసం జరుగుతుందని తెలిస్తే.. పోలీసుశాఖలో ఉన్న అన్నిరకాల వ్యవస్థల్లో.. ఏ ఒక్క దానికైనా సమాచారం అందుతుంది. దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. అమలాపురంలో జరిగిన ఘర్షణల విషయంలో అలాంటి కనీస సమాచారం పోలీసు శాఖకు అందలేదు. అంటే ఇంటలిజెన్స్ ఎంత ఘోరంగా ఫెయిలయిందో అర్థం చేసుకోవచ్చు.

ఆందోళనకారులు విరుచుకుపడబోతున్నారన్న కనీస సమాచారం ఉన్నా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు. ఉద్రిక్తలు ఉన్నా.. అమలాపురంలో పోలీసులు మూడు వందల మంది మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. అదనపు పోలీసు బలగాలు లేవు. దీంతో ఆందోళనకారులకు ఎదురు లేకుండా పోయినట్లయింది. పోలీసులు చేతులెత్తేశారనన ప్రచారం జరగడం మరింత ఉద్రిక్తతలకు కరణం అయింది.

రాజకీయ అవసరాల కోసం పోలీసు వ్యవస్థను గరిష్టంగా ఉపయోగించుకుంటూ… లా అండ్ ఆర్డర్ అంశంపై నిర్లక్ష్యం చేయడంతోే సమస్యలు వస్తున్నాయి. సొంత వర్గానికి ప్రాధాన్యత కోసం పోలీసు ఉన్నతాధికారులుగా అసమర్థుల్ని నియమించడం.. వారితో రాజకీయ ఆట ఆడుకోవడంతో సమస్య వచ్చింది. ఇప్పుడు అది ప్రజల ప్రాణాల మీదకు తెస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close